రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ పరిస్థితిని చక్కదిద్దుకునే పనిలో పడింది.
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాన పక్షపాతి అనే భావన వచ్చింది సీమాంధ్రప్రజల్లో.
దీంతో అక్కడ ఎవరూ కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. దీన్ని అధిగమించడానికి,
వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో పరువు దక్కించుకునేందుకు కాంగ్రెస్
పార్టీ వ్యూహ రచన చేస్తోంది.
రాష్ట్ర విభజనతో నష్టపోతున్న సీమాంధ్రకు భారీ ప్యాకేజీని ఇస్తామని
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ ప్యాకేజీ కేవలం సీమాంధ్ర
ప్రజలను చల్లార్చడానికే కాక.. వచ్చే ఎన్నికల హామీ గా కూడా ఉపయోగపడగలదని
కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ప్యాకేజీలో నంబర్ ఎంత పెద్దగా ఉంటే.. అది అంతగా
సీమాంధ్ర ప్రజలను ప్రభావితం చేస్తుందని, కాంగ్రెస్ కు అంత అనుకూల
పరిస్థితిని కల్పిస్తుందని వారు అనుకొంటున్నారు.
ప్యాకేజీ అంటే.. ఇప్పటికిప్పడు అందించేదేమీ కాదు. రాబోయే పది
సంవత్సరాల పాటు.. ఏడాదికి ఇంత అని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి
అప్పటికి రాజెవరో పేద ఎవరో.. ఈ వ్యూహంతోకాంగ్రెస్ అధిష్టానం
కేంద్రప్రభుత్వం చేత భారీ ప్యాకేజీని ప్రకటింపజేసే అవకాశాలున్నాయి.
ప్యాకేజీ డబ్బును ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు.. అనేది
కాంగ్రెస్ కు అనుకూలాంశం. దీన్న ఆయుధంగా చేసుకొని భారీ నంబర్ తో సీమాంధ్ర
ప్రజలను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తుంది. మరి సీమాంధ్ర ప్రజలు
టెంప్ట్ అవుతారా?
No comments:
Post a Comment