Menu bar





Showing posts with label statistics. Show all posts
Showing posts with label statistics. Show all posts

Tuesday, November 12, 2013

పార్లమెంటు సుప్రీం అంటారు. దానికి తిరుగే లేదంటారు. ఇది నిజమా?


పార్లమెంటు సుప్రీం అంటారు. దానికి తిరుగే లేదంటారు. ఇది నిజమా?

పార్లమెంటు భారత రాజ్యాంగం ఆధారంగా ఏర్పడింది. రాజ్యాంగానికి అది పూర్తిగా నిబద్ధతతో ఉండాలి. అదే ప్రమాణం చేసే ఎవరైనా పార్లమెంటులో అడుగుపెట్టాలి.

పార్లమెంటు రాజ్యాంగానికి అనుగుణంగా నడచుకుంటోందా లేదా అన్నది తేల్చవలసింది సుప్రీం కోర్టు! అంతిమంగా , పార్లమెంటు, రాజ్యాంగం, సుప్రీం కోర్టు - వీటన్నిటినీ నడిపించేది ప్రజా ధర్మం.

పార్లమెంటులో 500 మంది సభ్యులూ ఏకమై పోయినా - భారత రాజ్యాంగాన్నిరూపుమాపలేరు. అప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుంది.
ఒకోసారి ... ప్రజాభిప్రాయం - ఆ మూడు వ్యవస్థలను కూడా ప్రభావితం చెయ్యవచ్చు. అంతిమంగా ప్రజల తీర్పే అన్నుల మిన్నగా నిలుస్తుంది. అట్లాంటి అపురూపమైన సన్నివేశాలు జాతి జేవనంలో అప్పుడప్పుడూ వస్తాయి. సమైక్య ఉద్యమం అట్లాంటిదే!

తెలుగు జాతిని చీల్చే అధికారం కేంద్రానికి గానీ, పార్టీలకు గానీ, చివరకు పార్లమెంటుకు కూడా లేదని జనం చెబుతున్నారు. మాకు ప్యాకేజీలు వద్దు; రాష్ట్ర సమైక్యమే ముద్దు అని నినదిస్తున్నారు.

అసెంబ్లీలో సాధారణ జనాభిప్రాయం ఏమిటో తీర్మానమైనప్పుడు, రాష్ట్రపతి - దానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకోవాలి. సమైక్యమే కావాలని శాసన సభ తీర్మానిస్తే, అది జాతి సమగ్రతకు భంగం కాకపొతే, అట్లాంటి ప్రజాభిప్రాయాన్ని రాష్ట్రపతి మన్నించాల్సిందే! ఆర్టికల్ 3 లో రాసి ఉందిగదా అని , ప్రజల అభ్యంతరాలకు వ్యతిరేకంగా - రాష్ట్ర విభాజన చేయ్యలేరు!

పార్లమెంటు సభ్యులు కూడా గుడ్డిగా పార్టీ విప్ పాటించకూడదు! ఇట్లాంటి విషయాలలో పార్టీలకు వ్హిప్ అధికారమే ఉండకూడదు! బీజేపీ పార్లమెంటు సభ్యులకు రాష్ట్ర విచ్చిన్నాన్ని సమర్థించే నైతిక హక్కే లేదు. ఆ పార్టీలో పార్లమెంటులో మాట్లాడేందుకు ఈ రాష్ట్రానికి ప్రతినిధే లేడు! అట్లాంటి పార్టీ తగుదునమ్మా అని రాష్ట్ర విభజన నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది?

విభజన బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోవచ్చు; వచ్చినా అది వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డ్రాఫ్టు బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడే - జనం దాన్ని తిప్పి కొట్టడం ఖాయం. ప్రజలు ప్యాకేజీలు కోరడం లేదు; రాష్ట్ర సమైక్యతనే కోరుతున్నారు. ఈ వాస్తవం గ్రహించి నేతలు మసలుకోవాలి!

Monday, November 11, 2013

శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుంది?


               తెలంగాణా బిల్లును శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణా ఏర్పాటు అంశాన్ని అందరి కన్నా ముందుగా తలకెత్తుకున్న భారతీయ జనతా పార్టీ ఆ తర్వాతి కాలంలో ఉద్యమాన్ని అంతగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. తెలంగాణా ఛాంపియన్‌గా అవతరించాలనుకున్న భారతీయ జనతా పార్టీ ఆశలు తీరలేదు. ఆ స్థానం నుంచి తెలంగాణా రాష్ట్ర సమితిని తప్పించేం దుకు బిజెపి చేసిన చాలా ప్రయత్నాలు ఫలించలేదు. ఒక దశలో రాజకీ య జెఏసి నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొ న్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ చేసిన యత్నం ఆ ఎన్ని క వరకు ఫలించినా ఆ తర్వాత టిఆర్‌ ఎస్‌దే పైచేయిగా మారింది. ఇప్పటికీ టిఆర్‌ఎస్‌తో రాజకీయ వైరం గుంభనంగా కొనసాగుతూనే ఉంది.

                ఇరు పార్టీల మధ్య సఖ్యత కనిపించకపోగా శత్రుభావన నెలకొని ఉంది. అంతే కాకుండా తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత టిఆర్‌ఎస్‌ను ఆ పార్టీలో కలిపేసేందుకు మంతనాలు సాగుతుండటం కూడా బిజెపికి కంటగింపుగా మారింది. గత ఎన్నికలలో బిజెపి వైపు వెళ్లిన టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌తో అంటకాగుతుండటంతో భారతీయ జనతా పార్టీ తన వైరాన్ని కొనసాగిస్తున్నది. రాష్ట్రంలో ఇటు టిఆర్‌ఎస్‌, అటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు రెండు కూడా కాంగ్రెస్‌ పార్టీకే చేరువ అవుతుండటంతో ఇటు సమైక్య ఆంధ్ర ఉద్యమం వైపుగానీ అటు తెలంగాణా వైపు గానీ మొగ్గు చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఈ మేరకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సిద్ధాంత కర్తలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందువల్లనే ఇటీవల భారతీయ జనతా పార్టీ తన రూటును మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ఆంధ్ర వారికి, రాయలసీమ వారికి న్యాయం చేయకుండా తెలంగాణా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ స్థాయిలో చెబుతున్నారు.

                 కాంగ్రెస్‌ పార్టీ కేవలం తన రాజకీయ అవసరాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ విభజనను త పెట్టిందని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విపరీతమైన ప్రచారం చేసింది. ఈ నేపధ్యంలో లోక్‌సభ శీతాకాలం సమావేశాల్లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లు సభ ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది. లోక్‌సభలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లు వస్తే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌కు సహకరించి బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకమేనని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ఏర్పాటు అంశం తమ ఎజెండాగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ తలకెత్తుకుంటే దానికి ఎంత వరకు మద్దతు ఇస్తుందనేది ప్రశ్నార్ధకమేనని కూడా అంటున్నారు. మరి ఈ నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణా ప్రజలకు దూరం కాకుండా ఉండే విధంగానూ తెలంగాణా రాకుండా ఉండే విధంగానూ కూడా తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

                మరి ఈ రెండు అంశాలు ఏకకాలంలో ఏ విధంగా సాధ్యం అవుతాయనే విషయమే ఆసక్తికరంగా మారింది. దీనిపై భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు భారీ కసరత్తు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారతీయ జనతా పార్టీ వైఖరి మారలేదని బిజెపి సీనియర్‌ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయకుడు స్పష్టంగా చెప్పినా కూడా పార్టీ అనుసరిస్తున్న విధానం మాత్రం మారినట్లుగానే కనిపిస్తున్నది. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలోని వారికి న్యాయం చేయకుండా తెలంగాణా ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉండదనే వాదనను భారతీయ జనతా పార్టీ గట్టిగా చెబుతున్నది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఆంధ్ర ప్రాతం నాయకులు ఢిల్లీ స్థాయిలో తమ వాణిని వినిపించగా దానిపై బిజెపి అగ్ర నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే అదే సమయంలో తెలంగాణా అంశం నుంచి కూడా దూరంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

               తెలంగాణా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన తర్వాత దానిపై రాష్ట్ర అసెంబ్లీ ఏ విధంగా స్పందించినా కూడా దాన్ని రాష్టప్రతికి పంపుతారు. తెలంగాణాపై కేంద్రం పంపే డ్రాఫ్టు బిల్లు మెజారిటీ సభ్యులు ఆంధ్ర, రాయలసీమకు చెందిన వారు ఉన్న అసెంబ్లీ ఆమోదించే అవకాశమే లేదు. అందువల్ల మెజారిటీ సభ్యులు బిల్లును తిరస్కరించి పంపుతారు.అదే విషయాన్ని కేంద్రం రాష్టప్రతికి నివేదిస్తుంది. అప్పుడు రాష్టప్రతి నిర్ణయం తీసుకుని రాజ్యా ంగంలోని 3వ అధికరణ ప్రకారం విభజన చేయాల్సిందిగా సూచిస్తూ ేంద్రానికి ఆదేశాలిస్తారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. ఈ దశలో రాష్ట్ర అసెంబ్లీ తిప్పిపంపిన తీర్మానంపై బిజెపి లేదా ఇతర పక్షాలు లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ గందర గోళం మధ్య లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేయడమో లేదా ఓటింగులో పాల్గొనకపోవడమో భారతీయ జనతా పార్టీ చేయవచ్చు. ఇరు ప్రాంతాలను ఒప్పంచడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని బిజెపి ఆరోపించి బయటకు రావచ్చు.

                  అదే సమయంలో హైదరాబాద్‌పై ఆంక్షలు ఇతర విషయాలను కూడా బిజెపి లోక్‌సభలో ప్రస్తావించి తెలంగాణా ప్రజలను శాంత పరిచే చర్యలు తీసుకునే అవకాశం ఉందని బిజెపి వర్గాలు వెల్లడించాయి. ఈ విధంగా చేయడం వల్ల ఇటు తెలంగాణాలో అటు సీమాంధ్రలో కూడా బిజెపికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బిజెపి వాకౌట్‌ చేసినా, ఓటింగులో పాల్గొనక పోయినా కూడా లోక్‌సభలో తెలంగాణా బిల్లు నెగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజ్యసభలో తెలంగాణా బిల్లు నెగ్గే అవకాశం ఎటూ కనిపించడం లేదు.
ఆ ప్రక్రియ జరగాలంటే కాంగ్రెస్‌పార్టీ ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎంత కసరత్తు చేసినా కూడా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌కు సహకరించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఎన్నికలలోపు తెలంగాణా వచ్చే అవకాశాలు లేకుండా పోతాయని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తామే తెలంగాణా ఏర్పాటు చేస్తామని తెలంగాణా ఏర్పాటు కేవలం తమ వల్లే సాధ్యం అవుతుందని బిజెపి ఎన్నికలలో చెప్పుకునే వీలుంది. కాంగ్రెస్‌ పార్టీ చేతగాని తనం వల్లే తెలంగాణా ఏర్పాటు కాలేదనే అంశాన్ని బిజెపి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది

Friday, November 8, 2013

ఎన్నికలు వరకు ఆపితే రాష్ట్ర విభజన నిలిచిపోతుందా?

                       

                   రాష్ట్రవిభజనను వచ్చే సాధారణ ఎన్నికల వరకు వాయిదా వేయించగలిగితే, ఇక విభజన ప్రక్రియ ఆగిపోతుందని సమైక్యవాదుల ధృడంగా నమ్ముతున్నారు. అందుకు బలమయిన కారణాలు లేకపోలేదు. 

                    ఎందుకంటే ఈసారి యుపీయే, ఎన్డీయే రెండు కూటమిల మధ్య చాలా గట్టి పోటీ ఉంటుంది, గనుక వీటిలో ఏ ఒక్కటి కూడా పూర్తి మెజార్టీ సాధించి తమంతట తాముగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అంతే గాక నితీష్ కుమార్, ములాయం సింగ్ వంటి వారు మూడో ఫ్రంట్ ఏర్పాటు గురించి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవేళ అదికూడా అవతరిస్తే అప్పుడు ఈ మూడు కూటమిల మధ్య ఓట్లు చీలిపోవచ్చును. థర్డ్ ఫ్రంట్ అవతరించక పోయినప్పటికీ, యుపీయే, ఎన్డీయే కూటమిల మధ్య ఓట్లు చీలడం ఖాయం గనుక ఎవరికీ పూర్తి ఆధిఖ్యత రాకపోవచ్చును. 


                    అప్పుడు రెండు కూటములకి దేశంలో ప్రతీ ఒక్క యంపీ మద్దతు కీలకంగానే మారుతుంది. అటువంటప్పుడు ఏకంగా 25మంది సీమాంధ్ర యంపీల మద్దతు చాలా కీలకంగా మారబోతోంది. అయితే వారిలో వివిద పార్టీలకు చెందిన వారుంటారు గనుక రెండు కూటములకి వారి మద్దతు పొందే అవకాశం సరి సమానంగా ఉంటుంది. అంటే కేంద్రంలో ఒకవేళ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినా, రాష్ట్రం సమైక్యంగా ఉంచదానికి అంగీకరిస్తే వారిలో కనీసం 15-20 మంది మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అందుకు ప్రతిగా ఎన్డీయేకి తెలంగాణాలో తెరాస మద్దతు లభ్యం అవదు. అయితే ఈ సారి తెరాస నుండి కేవలం 5-8 మంది యంపీలుగా గెలిచే అవకాశమున్నట్లు సర్వేలు చెపుతున్నాయి గనుక, ఎన్డీయే కూటమి 15-20 మంది యంపీలున్న సీమాంధ్ర వైపే మొగ్గు చూపవచ్చును. 

                  ఒకవేళ యూపీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, కేంద్రంలో ఐదేళ్ళపాటు అధికారంలో కొనసాగాలంటే సీమాంధ్ర యంపీలపై ఆధారపడక తప్పదు. బహుశః అందువలననే రాష్ట్ర విభజనను ఎన్నికలు వరకు నిలువరించగలిగితే, విభజన ప్రక్రియ ఆగిపోతుందని సమైక్యవాదులు దృడంగా భావిస్తున్నారు.

                        అయితే ఈ రెండు కూటములలో ఏదో ఒకటి అధికారంలోకి రావడం ఖాయం గనుక, అవి కేంద్రంలో మళ్ళీ కుదురుకొనే వరకు రాష్ట్ర విభజనలో కొంత జాప్యం ఉండవచ్చు తప్ప పూర్తిగా నిలిచిపోయే అవకాశం లేదు.

Sunday, November 3, 2013

రాజ్యాంగం 3వ అధికరణలోనే రాష్ట్ర సమైక్యత కాపాడే క్లాజు [ఇ]?!

- డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]

రాజనీతి శాస్త్రాన్ని కాస్తా స్వతంత్రభారతదేశంలో "పదవీరాజకీయ శాస్త్రం''గా మార్చిన 'ఘనులు' కాంగ్రెస్ నాయకులు! అలాంటివాళ్ళు దేశ సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థను ప్రజా ప్రయోజనాల రక్షణకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాల సుస్థిరతకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తోడునీడగా ఉండకుండా కేవలం ఎన్నికలలో విజయం సాధించడం కోసం 'పావు'గా వినియోగించుకుంటూ వస్తోంది. అలాంటి తాజాగా చేతివాటంగా అందివచ్చిన 'పావు' - స్వతంత్ర భారతంలో భాషాప్రయుక్త ప్రాతిపదికపై మొట్టమొదటిసారిగా ఏర్పడిన పెద్దరాష్ట్రమైన తెలుగువారి "ఆంధ్రప్రదేశ్''ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో తమ నాయకురాలైన ఇటాలియన్ సోనియా రాజకీయ కుటుంబ ప్రయోజనాలకోసం అశాస్త్రీయంగా నిట్టనిలువునా చీల్చడానికి తీసుకున్న నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ లో భాగమైన తెలంగాణా ప్రాంతంలో 15 పార్లమెంటు సీట్లకోసమని వేర్పాటువాదులయిన కొందరు రాజకీయ నిరుద్యోగులతో చేతులు కలిపి కాంగ్రెస్ ఈ పనిచేసి, తెలుగుజాతికి విద్రోహం తలపెట్టి, ఆ విద్రోహాన్ని సమర్థించుకోడానికి మరికొన్ని తప్పులు చేస్తూ పోతోంది. ఇందుకు అది ఆధారపడుతున్నది రాజ్యాంగంలోని 2,3,4 అధికరణలమీద. ఈ మూడింటి సారాంశం - భారత యూనియన్ లో కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి, ఉన్న రాష్ట్రాలనుంచి భూభాగాలను చీల్చి మరొక రాష్ట్రంలో విలీనం చేయడానికి పార్లమెంటుకు శాసనాధికారం ఉన్నదని చెప్పడం. 3వ అధికరణ ప్రకారం - నూతన రాష్ట్రాలను ఏర్పర్చడమే గాక, ప్రస్తుతమున్న రాష్ట్రాల వైశాల్యాన్ని పెంచడానికి, లేదా కుదించడానికి, లేదా వాటి సరిహద్దుల్ని మార్చడానికి లేదా ఆ రాష్ట్రాల పేర్లను కూడా మార్చడానికి శాసనం రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉంది!


అయితే పాలనాధికారాన్ని చేపట్టే రాజకీయపార్టీలు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం "బ్రూట్ మెజారిటీ'' ద్వారా తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించడానికి ఈ అధికరణవల్ల అవకాశం దొరికింది! రానురానూ ఈ తప్పుడు సంప్రదాయం ఎక్కడికి దారితీస్తోంది? పాలనా పగ్గాలు పట్టుకున్న అధికారపక్షాలు భారత సమాఖ్య వ్యవస్థలోని రాష్ట్రాల ప్రజల మెజారిటీ అభీష్టాన్ని, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రాల చట్టసభలనూ ఖాతరు చేయకుండా కూడా కొత్త రాష్ట్రాలను స్వార్థ ప్రయోజనాలకోసం ఏకపక్షంగా ఏర్పర్చచే దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది.

ఇది పంజాబ్-హర్యానాలుగా పంజాబ్ విభజనతోనే మొదలయింది! పంజాబ్ శాసనసభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా సభ ఆమోదముద్ర లేకుండానే కేంద్రంలోని కాంగ్రెస్ అధికారపక్షం పంజాబ్ ను విభజించేసింది! రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ఐక్యతను బలిగొన్నది! అదే పద్ధతిని ఇప్పుడు దేశంలోని తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను బలిగొన జూస్తోంది! ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తనకు తననే ఆంధ్రప్రదేశ్ లో ఆత్మాహుతికి సిద్ధమవుతోంది!


హోం శాఖ నోట్ లో నూతన ప్రతిపాదన!

కొందరు వేర్పాటువాద నాయకుల వత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ ను 3వ అధికరణ ఆధారంగా విభజించడానికి సిద్ధమయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలైన ఇటాలియన్ సోనియా నాయకత్వంలో హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర విబజన కోసం మూడు రకాల ప్రతిపాదనలతో ఒక "నోట్'' (పత్రం) తయారు చేసింది. దాన్ని మంత్రి షిండేకి సమర్పించింది. ఇదో విచిత్రమైన పత్రం! దీనికి పునాది రాజ్యాంగంలోని 3వ అధికరణమే అయినా, హోంశాఖ "నోట్''లో మొదటి అంశం పూర్తిగా ప్రజల పరిశీల దృష్టికి యింకా వచ్చినట్టులేదు!

అది - "పదిజిల్లాలతో ఏర్పడగల తెలంగాణా రాష్ట్రంలో ఆ పదిజిల్లాలతో పాటు తెలంగాణలో ఐచ్చికంగా ఏ ఇతర జిల్లాలయినా సరే వచ్చి చేరదలిస్తే అవన్నీ చరవచ్చు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పిమ్మట తెలంగాణాగానే ఏర్పడుతుంది'' ["Along with 10 districts, any other districts that voluntarily come forward to join in Telangana will be taken into consideration and Telangana will be formed]!

ఈ "నోట్''ను ఎవరు తయారుచేశారోగాని సదరు పత్రకారుడు సరసుడే కాదు, ప్రజలను విభజించి-పాలించటం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! రాష్ట్ర మెజారిటీ, ప్రజల ఆకాంక్షకు అనువునంగానే ఈ 'నోట్' డ్రాఫ్టింగ్ తయారైనట్టుంది! చివరికి ఏ కేంద్ర పాలకపక్షం ఏ "3''వ రాజ్యాంగ అధికరణ ఆధారంగా, ఐక్యంగా ఉన్న తెలుగు జాతిని చీల్చాలని ఉవ్విళ్ళూరుతోందో, సరిగ్గా అదే అధికరణలోని "ఇ''క్లాజు కూడా "రాష్ట్రం పేరును మార్చుకోవచ్చు''నని అభ్యంతరం లేదనీ చెప్పింది! అంటే హోంశాఖవారి అద్భుతమైన 'డ్రాఫ్టింగ్' పర్యవసానంగా వెలువడిన ఆ "నోట్'' తెలంగాణాలోని పదిజిల్లాలతో పాటు మరిన్ని జిల్లాలు, ఎన్ని జిల్లాలు వస్తే అన్ని జిల్లాలు 'తెలంగాణా రాష్ట్రం'గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించినట్టయింది! ఆ లెక్కన రాష్ట్రంలోని మిగిలిన 13జిల్లాలు కూడా ఆ పది జిల్లాలతో కలిసిపోతే - అదే హోంశాఖ "నోట్'' ఆశిస్తున్న మొత్తం రాష్ట్రం అంతా నిజంగానే అక్షరాలా "తెలంగాణా'' అవుతుంది గదా!!


తెలంగాణా రాష్ట్రంగా "ఆంద్ర ప్రదేశ్" మార్పు!


ఈ మాట వ్యంగ్యంగా అనటంకాదు, ఎగతాళి కోసం అంటున్న మాట అంతకంటే కాదు. నిజానికి "తెలంగాణం'' అంటే తెలుగులకు (తెలుగువారికి) అణెము, అంటే తెలుగువారు నివశించే చోటు అనీ, ప్రాంతం అనీ, నివాసమనీ వ్యవహారార్థమూ, విశిష్టార్థమూనని గుర్తించాలి! పండితులూ, నిఘంటుకారులూ స్థిరపరిచిన స్థిరనివాసమే తెలుగువారి తెలంగాణం! చరిత్ర తెలియని మన తెలుగు రాజకీయ సన్యాసులకన్నా, గిరీశం భాషలో మన 'వెధవాయిల'కన్నా కోస్తాంధ్ర, సీమాంధ్ర ప్రాంతాలతో పాటు సుమారు 300 ఏళ్ళపాటు దక్కన్ వరకూ ఏలికలుగా ఉన్న మహమ్మదీయ పాలకులు తెలుగు పాలకులకన్నా తెలివిగల వాళ్ళు కాబట్టి, తాము పాలిస్తున్న నివసిస్తున్న ప్రాంతమంతా తెలుగువారిది కనుకనే మొత్తం తెలుగు ప్రాంతాన్ని 'తెలంగాణం' అని [15-16 శతాబ్దాల దేశపటాల్లో "తెలంగాణం'' అని లిఖిత పూర్వకంగా పేర్కొని] పేరు పెట్టుకున్నారని గుర్తించాలి!

అందువల్ల "తెలంగాణా రాష్ట్రం'' అంటే మొత్తం తెలుగు ప్రాంతమంతటికీ వర్తిస్తుంది కాబట్టే హోంశాఖ "నోట్'' తెలుగువారి అన్ని జిల్లాలూ వచ్చి చేరమని ("any other districrs that come forward") ఆహ్వానం పలికి ఉంటుంది! మరో మాటలో చెప్పాలంటే మిగతా 13 సీమాంధ్రజిల్లాలు కూడా వెరసి మొత్తం 23 జిల్లాలతో కూడిందే తెలంగాణం/ఆంధ్రప్రదేశ్ లేదా విశాలాంధ్ర రాష్ట్రం గదా! అందువల్ల ఇప్పుడున్నదంతా 'తెలంగాణం' అదే 'తెలుగునాడు! కాబట్టి రాజ్యాంగంలోని 3వ అధికరణం "ఇ''సెక్షను ప్రకారం "ఆంధ్రప్రదేశ్'' రాష్ట్రాన్ని కృత్రిమంగా విభజించకుండానే పేరును అర్థవంతంగా అమరగల "తెలంగాణా''గా లేదా "తెలుగునాడు''గా మార్చుకోవచ్చు! తద్వారా "విభజన'' అనే పురుగును, లేదా 'కలుపుమొక్క'ను లేదా 'బి.టి.'లాంటి వినాశకర విత్తనాన్ని [టెర్మినేటర్ సీడ్] మనస్సులనుంచి పెకించివేయవచ్చు!

తొలుత దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారి రాష్ట్రం ఏర్పడినప్పుడు, రెండురకాల పరాయి పీడనా పాలనలనుంచి తెలుగుజాతి ఒక్క గొడుగుకిందికి వచ్చినప్పుడు, ఆకారాది క్రమం కోసం అటు ఇంగ్లీషు వర్ణమాలకు, ఇటు తెలుగు వర్ణమాలకు తొలి అక్షరంతో 'A'/ 'ఆ'/"ఆంధ్రప్రదేశ్" (Andhra Pradesh) ఏర్పడడం శుభదాయకం అనుకున్నారు పెద్దలు. ఆ ఆశతోనే, పేరు తప్పు సమాసం అయినా "ఆంధ్రప్రదేశ్' పేరును ఎంచుకోవటం జరిగింది. కాని, ఆకారాది క్రమంలో తొలి అక్షరంతో మనం 8వ షెడ్యూల్ లో అగ్రభాగంలో కనిపించినంత మాత్రాన అభివృద్ధికి చిహ్నం కాదు, అలా లేకపోయినంత మాత్రాన ఒక రాష్ట్రం పేరు కడుపంక్తిలో [ఉదా: తమిళనాడు - Tamilnadu ఉందికాబట్టి ప్రగతిపథంలో అది అట్టడుగున ఉందనీ చెప్పలేం!]


చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు!

అందువల్ల, వ్యక్తులకుగానీ, రాష్ట్రంకుగాని వారికి (వాటికి) తగినట్టుగా అర్థవంతంగా ఉండాలేగాని 'పేరు' బలాల్ని బట్టి, 'నక్షత్రబలాల్ని' బట్టి, విలువలూ, గౌరవ ప్రతిష్టలూ సమకూడవు! ఎందుకంటే అబద్ధాలతో, బూతులతో 'ఉద్యమాలు' నిర్మించే వారంతా చచ్చినా కొమరం భీములూ కాలేరు, దొడ్డి కొమరయ్యలూ కాజాలరు; వినాయక వేషధారులంతా ప్రజానాయకులు కారు; గాంధీ పేరుతొ చెలామణీ కాదలచుకునే వారంతా గాంధీలూ కారు, భగత్ సింగ్ పేరు తగిలించుకునే వారు విప్లవకారులూ కాలేరు; అల్లూరి సీతారామరాజును కొలిచేవారంతా ఆయని పేరు ఉచ్చరించడానికీ తగరు; రుద్రమ పేరు పెట్టుకున్న వారంతా వీరనారీమణులూ కారు; చిత్తం చెప్పుల మీద భక్తి శివుడిమీద నిలిపే వారంతా నిజమైన భక్తులూ కారు; యావదాంధ్ర శ్రమజీవుల ప్రతినిధిగా కష్టజీవులకు బతుకునిచ్చే బతుకమ్మ/అదే దుర్గమ్మ/అదే గౌరమ్మను కాస్తా హైజాక్ చేసి క్షుద్ర రాజేకీయాలకోసం వాడుకో జూసే సంపన్నుల బతుకులు బతుకులూ కావు; ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఆంద్ర (తెలుగు) జాతి చరిత్రకూ దాని వేల సంవత్సరాల సంస్కృతీ విభావానికీ ఐకమత్యానికీ దివిటీలుగా నిలిచినా శాతవాహన, కాకతీయ, విజయనగర ప్రజాహిత పాలనా యుగాలను విస్మరించిన తెలుగుజాతి విచ్చిన్నకులూ, అందుకు దోహదం చేసిన ఆధునిక విద్రోహులైన రాజకీయ దుర్యోధన, దుశ్శాసనలూ మూడు ప్రాంతాల ప్రజాబాహుళ్యం గుండెల్లో శాశ్వత శత్రువులుగా నమోదు కాకుండా తప్పించుకోలేరు; తెలుగువారి మహాయుగాల ఆనవాళ్ళను చేరిపివేయడానికి ప్రయత్నించిన ఆధునిక రాజకీయ 'సామంతులు'గా, చరిత్రహీనులుగా వీళ్ళు మిగిలిపోతారు!

ఎందుకంటే, "ప్రజాప్రతిధుల'' వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలక పక్షాలు, ముఖ్యంగా దీర్ఘకాలంపాటు దేశాన్ని ఏలుతూ వచ్చిన చెడిపోయిన కాంగ్రెస్ తో కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ, ఇన్నేళ్ళుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ కుత్సితమైన స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి సహితం వెనుదీయ లేదు. వాటిల్లో కొన్ని - రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్రూట్ మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి - రేపటి పాలక పక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలు! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేడ్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవి కావు! స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పాలకులూ, మత రాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధవిరుద్ధమైన సవరణ చట్టాలు తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ అధికరణ ఒకటికాగా, ఆ సవరణ కేంద్రం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ప్రజాహితంగా దేశంలోనే తొలిమెట్టుగా తెలుగుజాతినంతనూ ఒక్క గొడుగు కిందికి తెచ్చేందుకు - సాధికార కమీషన్ సిఫారసులు ఆధారంగానే - 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది; దానికి తగినట్టుగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య కాలక్రమంలో ఉద్యోగ సద్యోగాలలో, ప్రాంతాలమధ్య సమతుల్యమైన ఆర్థికాది రంగాలలో సాధ్యమైనంత త్వరగా అభ్యుదయాన్ని సాధించడం కోసం, ఏ ఇతర రాష్ట్రానికీ లేని ఒక విశిష్టమైన ప్రత్యేకమైన (స్పెషల్) సవరణ చట్టాన్ని 371 (డి) పేరిట రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.


371-డి ప్రత్యేకత!

కాగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషాప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు ఈడేర్చుకోడానికి ఉద్దేశించింది కాదు. కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు "డి'' క్లాజుద్వారా రాజ్యాంగానికి సవరణ చట్టం తీసుకువచ్చి, దానికి భాష్యం చెప్పాలన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్టుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే యితర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలుగాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371 (డి) సవరణ చట్టానికి మూడింట రెండువంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దానిద్వారా కేంద్ర క్యాబినెట్టుకూ సాధ్యమవుతుంది గాని అడ్డదారుల్లో కాదు! పైగా, హోంశాఖ చూపిస్తున్న "నోట్''లో, నేడు ప్రజావ్యతిరేకులుగా మారి ప్రజలకోసం పదవుల్ని త్యాగం చేయలేని 'దేహభక్తి'కి తప్ప దేశభక్తికి దూరమైనా నాయకులకు తెలియని ఒక విశేషం రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి యిచ్చిన "ఒకటవ వివరణ'' లోనే ఉంది. ఇది రెండు రకాల భాష్యానికి అవకాశమిస్తోంది.

ఎలా అంటే, 3వ అధికరణలో 'ఎ' నుంచి 'ఇ' వరకూ ఉన్న క్లాజుల్లో “రాష్ట్రం'' అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యు.టి.) ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది! అయితే జనాన్ని పాలకపక్షాలు గందరగోళపరచడం కోసం చేసిన ప్రయత్నం “మినహాయింపు క్లాజు'' పేరిట “రాష్ట్రం'' అనే పదంలో “కేంద్రపాలిత ప్రాంతం'' చేరి ఉండదని అదే “వివరణ (1)''లో విరుద్ధంగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్రప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ, ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని “కేంద్రపాలిత ప్రాంతం'' గానో (యు.టి) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే “రాష్ట్ర విభజన'' గురించి ఆలోచించాలి గాని అంతకు ముందు కాదని ప్రతిపాదించడానికి కారణం - 3వ అధికరణంలోని ఈ అయోమయపు “వివరణ 1''!

తెలుగుజాతికి ఆత్మవిశ్వాస సూర్యోదయం!

కాబట్టి - మొత్తం తెలుగుజాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోడానికిగాను, "ఆంద్ర'' అనే పదం పట్ల (దానర్థం తెలుగు అనేది తెలియక) అజ్ఞానంతో కొందరు 'ఎలర్జీ' పెంచుకుని, తెలుగుజాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగా 3వ అధికరణలోని "ఇ''క్లాజు ప్రకారం నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ, ఏ తెలుగువాడికీ అభ్యంతరం ఉండదు, మనసారా ఆహ్వానించి తీరుతాడు! సెంటిమెంటును గౌరవించాలనుకునే వారంతా కోస్తా నుంచి దక్కను దాకా తెలుగువారి నివాస ప్రాంతంగా ''తెలంగాణా'' పేరు హేతుబద్ధమైన పేరు; రాష్ట్రానికి చక్కగా అమరుతుంది, అర్థవంతంగా భాసిల్లుతుంది. అరమరికలులేని తెలుగుజాతికి ఆత్మవిశ్వాస సూర్యోదయం గా చిరంజీవిత్వం కల్గిస్తుంది!

2/3 వ వంతు ఆధిక్యంతో కూడా పార్లమెంటు రాష్ట్రాన్ని విభజించ లేదు!



పరిపాలనకు సంబంధించినంత వరకు పార్లమెంటు సుప్రీం అంటారు. కానీ అంత లావు పార్లమెంటు కూడా రాజ్యాంగానికి అధిపతి కాదు! రాజ్యాంగమే సర్వోన్నతం! రాజ్యాంగ స్వభావాన్ని పార్లమెంటు మార్చ లేదు! పార్లమెంటులో 2/3 వ వంతు ఆధిక్యం ఉన్నప్పటికీ - రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చ లేదు! అనేక సందర్భాలలో సుప్రీం కోర్టు రాజ్యాంగానికి భాష్యం చెబుతూ - పార్లమెంటు అధికారాలకు ఉన్న హద్దులను గుర్తు చేసింది. హద్దు మీరడాన్ని నిలువరించింది. 

రాష్ట్ర విభజనకు పార్లమెంటుకు సంపూర్ణ అధికారం లేదు; ఉన్న అధికారం వివిధ పరిమితులతో, నిర్ణయాత్మకమైన షరతులతో ఉంది. 1. రాష్ట్రపతికి ఇందులో స్వతంత్ర ప్రమేయం ఉంది; 2. రాష్ట్ర అసెంబ్లీకి ఇందులో రాజ్యాంగబద్ధ పాత్ర ఉంది. 3. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి - 371-డి రూపంలో ఉన్న్నరాజ్యాంగ ప్రతిపత్తికి సమాధానం చెప్పవలసిన ఆగత్యం ఉంది.
రాష్ట్రపతికి స్వతంత్ర ప్రతిపత్తి:
రాష్ట్రపతి ప్రభుత్వం మాట ప్రకారమే నడుచు కోవాలి. నిజమే! కానీ - రాష్ట్ర విభజనకు సంబంధించి మాత్రం - రాష్ట్రపతికి స్వతంత్ర ప్రతిపత్తి ప్రత్యేకంగా లభిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు మధ్య రాష్ట్రపతి ఒక ధర్మ మూర్తిగా వ్యవహరించాలన్నది రాజ్యాంగ అభిలాష. ఈ సందర్భంలో రాష్ట్రపతి పీఠం 'విక్రమార్కుడి సింహాసనం' వంటిదే కావాలి. అకడ ఎవ్వరు ఉన్నా రాజ్యాంగ స్ఫూర్తిని పదిలంగా నిలుపుతూ, ధర్మ రక్షకులుగా వ్యవహరించాల్సిందే! అక్కడ ఉన్న ధర్మ సూత్రం ఏమిటి? 

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశం - పూర్తిగా రాష్ట్ర ప్రజల బాగోగులకు సంబంధించిన విషయం. అదే సమయంలో - రాష్ట్ర నైసర్గిక భౌగోళిక రాజకీయ స్వరూపంలో మార్పులు యావత్తు దేశానికి కూడా సంబంధించిన అంశాలే! ఒక రాష్ట్రంలో వచ్చే మార్పులతో - సరిహద్దు రాష్ట్రాలకు లేదా సమాన అంశాలలో వివాదాలు ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా సంబంధం ఉంటుంది. వాళ్ళకీ చెప్పుకునే, సంప్రదించే, మార్పు కోరే హక్కు ఉంటుంది. అట్లాగే - ఒక రాష్ట్రం దేశం నుంచి విడిపోతానని ఏకగ్రీవ తీర్మానం చేసినంత మాత్రాన - విడిపోయే హక్కు ఏకపక్షంగా లభిస్తే, అది దేశ సమగ్రతకే భంగకరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే - రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో - సంబంధిత రాష్ట్ర శాసన సభ, విధాన సభలకు అభిప్రాయం చెప్పే హక్కు మాత్రమే ఇచ్చారు. కానీ, నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వ లేదు! ఆ అభిప్రాయం పరిశీలించి రాష్ట్రపతి సరైన నిర్ణయం తీసుకొంటారు. ఇదీ అసలు వాస్తవం! 

కాగా, మన విభజన వాదులు - ఈ 'జాతీయ ప్రాతిపదికను' - ఈ 'రాజ్యాంగ మౌలిక దృక్పధాన్ని' అసలు ప్రస్తావనకే తేకుండా, 'రాష్ట్ర అసెంబ్లీ' అభిప్రాయం తీసుకోవడం - 'కేవలం ఆనవాయతీనే', 'కట్టుబడవలసిన ఆగత్యం లేదు' - 'అభిప్రాయం తీసుకోవచ్చు - తీసుకోక పోవచ్చు', 'మెజారిటీ అభిప్రాయం చెల్లదు', 'విభజన మైనారిటీల హక్కు' - వగైరా వక్రీకరణలు, అభూత కల్పనలు చేస్తున్నారు. రాజకీయ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి - రాజ్యాంగ నిబద్ధతలన్నీ గాలికి కొట్టుకు పోతాయి - అని బూకరిస్తున్నారు. (రాజ్యాంగ ప్రతిష్ట విషయంలో - న్యాయ స్థానాలు ఇందిరాగాంధీ అహంకారాన్నే మట్టి కరపించాయి. సోనియా మంకుపట్టుకూ తగిన సమాధానం తప్పక చెబుతాయి). 

రాష్ట్ర శాసన సభ, విధాన సభల సభ్యులు రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు. ఆ సభలు రాజ్యాంగబద్ధ సంస్థలు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వేళ - ప్రభావిత ప్రాంతాల ప్రజల అభిప్రాయానుసారం నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగమే సూచించింది. అభిప్రాయం తీసుకోవడం ఎందుకు? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయ్యడానికా? కాలక్షేపానికా? నాటకీయత కోసమా? తమాషా చూద్దామనా? 'అభిప్రాయ సేకరణ' అన్న రాజ్యాంగ ప్రస్తావన ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక సంప్రదాయం కావాలన్నదే రాజ్యాంగ ఆకాంక్ష! ఈ ప్రజాభిప్రాయాన్ని నాటి దేశ, కాల, మాన పరిస్థితులనుబట్టి, సమస్య తలెత్తిన సందర్భం బట్టి, రాజ్యాంగ మౌలిక సూత్రాల ఆదేశాన్ని అనుసరించి - ధర్మ నిర్ణయం చేసే అధికారం - రాష్ట్రపతికి లభించింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విషయంలో - రాష్ట్రపతి పాత్ర కేవలం 'రబ్బర్ స్టాంప్' వంటిది కాదు! తన విచక్షణను, విజ్ఞతను వ్యక్తం చేయవలసిన బాధ్యత రాష్ట్రపతిపై ఉంది. ఆ అధికారం ఆయనకు ఉంది.

విభజనకు ప్రాతిపదిక ఏమిటి?
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకోవడానికి ప్రాతిపదిక ఏమిటి? ప్రస్ఫుటమైన, స్పష్టమైన, బలమైన రాజకీయ నిర్ణయం అందుకు అవసరం. మరి, రాజకీయ నిర్ణయం అంటే ఏమిటి? సోనియా గాంధీ ఇష్టాయిష్టాలేనా? అట్లాంటి దిక్కుమాలిన నిర్వచనం ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఉండదు; ఉండకూడదు! కేంద్రంలో అధికార పార్టీ రాజకీయ అనివార్యతలు, లేదా ప్రభుత్వ అధినేత వ్యక్తిగత అవసరాలు దానికి ప్రాతిపదిక కాకూడదు. ఆసెంబ్లీ తీర్మానమే దానికి ప్రాతిపదిక కావాలి! ఆంటే రాజ్యాంగబద్ధంగా వ్యక్తీకరించ బడిన ప్రజాభిప్రాయమే దానికి ప్రాతిపదిక కావాలి! 

అట్లాంటి ప్రజాస్వామిక రాజకీయ నిర్ణయం లేకుండానే, ప్రైవేటు పార్టీల ఆత్మీయ లేఖలు, ప్రేమలేఖలు, బలవంతపు లేఖలు, దాగుడుమూతల లేఖలను - రాజకీయ నిర్ణయంగా ఎట్లా తీసుకుంటారు? అట్లా చెల్లుతుందని రాజ్యాంగంలో ఉందా? మెజారిటీ పార్టీలు - ఆ పార్టీల అధినేతలు కుమ్మక్కై - దేశాన్ని అమ్మేసే నిర్ణయం చేసినా చెల్లుబాటు అవుతుందా? ప్రజల ప్రమేయం లేని ప్రజాస్వామ్యం ఒక ప్రజాస్వామ్యమేనా? ఈ విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర శాసన, విధాన సభల తీర్మానం కోరాల్సిందే! అదే ప్రజాస్వామిక రాజకీయ నిర్ణయం అవుతుంది.

మన విభజన వాదులు ఇక్కడ 'మైనారిటీ ప్రతిపత్తి' మాట తెస్తున్నారు. విడిపోవాలని కోరుకునే ప్రజలు - ఎప్పుడూ - మైనారిటీలోనే ఉంటారు కనుక, అసెంబ్లీలో మా మాట ఎప్పటికీ నెగ్గదు కాబట్టే - ఆర్టికల్ -3 మాలాంటి వాళ్ళ కోసమే - అసెంబ్లీ ఉత్తుత్తి అభిప్రాయం చాలు - అనే ఏర్పాటు చేసింది. అంబేద్కర్ మహాశయుడు చాలా ముందు చూపుతో ఈ ఏర్పాటు చేసాడు, అని నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ మాటలకు హేతుబద్ధత ఎంత ఉందో చూద్దాం! 

>> విడిపోతాము - అని చెప్పేవాళ్ళు ఎప్పుడూ మైనారిటీలోనే ఉంటారని - రాసిపెట్టి లేదు! మహారాష్ట్రలో, యూపీలో విడిపోవడానికి మెజారిటీ తీర్మానమే ఉంది. అయినా దానిని పరిగణనలోకి తీసుకోలేదు! ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్ విభజన డిమాండు మైనారిటీ డిమాండే! అయినా, అసెంబ్లీ తీర్మానమే ప్రాతిపదికగా ఆయా రాష్ట్రాల పునర్విభజన సాధ్యమయ్యింది. రాజకీయ నిర్ణయమంటే - నిరంకుశ నిర్ణయం మాత్రం ఎప్పటికీ కాబోదు!

>> తెలంగాణా విషయంలో కూడా - అట్లాంటి ప్రజాస్వామిక రాజకీయ నిర్ణయం - సాధ్యపడేదే! కానీ, విభజన వాదులు చేసిన విద్వేష ప్రచారం, ఒక శత్రు సమాజంతో యుద్ధం చేస్తున్నామన్న విషమ వాతావరణం సృష్టించడం, జన సామాన్యం అభిప్రాయాలకు భిన్నంగా గొంతెమ్మ కోర్కెలు కోరడం - అందులో దాగిన వివక్షత, హింసాత్మక ప్రవృత్తి - ఇవన్నీ విభజన డిమాండు - తెలంగాణా సామాన్య ప్రజల చిరకాలపు ఆకాంక్ష - అన్నట్లుగా కాకుండా, ఒక కుట్ర పూరితమైన రాజకీయ స్వార్థపరుల హింసాత్మక దాడిగా ఒక భయానక రూపం ముందుకు వచ్చింది. జాతీయ రాజకీయాలలో నేడు ఉన్న సందిగ్ధ పరిస్థితినుంచి, సంక్షోభాన్నుంచి గట్టెక్కడానికి ఒకరు, ఆ బలహీనతనే సొమ్ము చేసుకొందామని మరొకరు - పోటీబడి - ప్రజాస్వామిక సంప్రదాయాలను, రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కి - రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని ప్రయత్ని స్తున్నందు వల్లనే - రాష్ట్ర విభజనకు ప్రజల మద్దతు లోపించింది!


>> మైనారిటీ అభిప్రాయానికి రాజ్యాంగం ఆర్టికల్ 3 గుర్తింపు ఇస్తోందని ప్రచారం చేస్తున్న విభజన వాదులు - పార్లమెంటులో కూడా - మైనారిటీ వాదనే చెల్లుతుందని - రాజ్యాంగం ఎందుకు చెప్పడం లేదో వివరించాలి. మైనారిటీ అభిప్రాయంలో ఔచిత్యాన్ని - తోటి ప్రజలకే నచ్చ చెప్పలేని వాళ్ళు - దేశ ప్రజలకు ఎట్లా నచ్చ చెప్పగలరో స్పష్టం చెయ్యాలి. ప్రజలకు నచ్చ చెప్పటం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఇవేవీ వాళ్లకు అక్కర లేదు; సోనియా కరుణాకటాక్షాలే చాలన్నమాట! అధికార మదంతో రాజ్యాంగ విధివిధానాలను పాటించనప్పుడు ధర్మ పీఠం తలుపులు తట్టే అవకాశం ఎట్లాగూ ఉంది.
రాజ్యాంగ అతిక్రమణ అసాధ్యం!

అసెంబ్లీ తీర్మానం బిల్లు పంపించవలసిందే! ఉభయ సభలు వ్యక్తీకరించిన అభిప్రాయంపై రాష్ట్రపతి ధర్మ నిర్ణయం చేయవలసిందే! పార్లమెంటులో బిల్లు చర్చకు రావలసిందే! బిల్లులో ఉన్న ప్రస్తావనలను బట్టి దానికి తార్కిక ముగింపు ఏమిటో నిర్ణయం కావలసిందే!

అయితే, ఈ ప్రక్రియకు మధ్యలోనే - న్యాయపరమైన చిక్కులు తప్పవు! ఆర్టికల్ 371-డి అస్తిత్వం విసురుతున్న సవాళ్ళకు సమాధానం చెప్పకుండా విభజన ప్రక్రియ ముందుకు సాగదు. నదీ జలాల వివాదాలకు పరిష్కారం చెప్పకుండా - ఆమేరకు - వివిధ రాష్ట్రాలలమధ్య సమన్వయం సాధించకుండా - విభజన కుదరదు! ముందుగానే, 371-డి విషయంలో ఏమి చేస్తారో, పారదర్శకంగా ఎట్లా వ్యవహరిస్తారో, దానిలోని న్యాయపరమైన వివాదాలకు ఎట్లా పరిష్కారం చెబుతారో, అందులోని రాజ్యాంగ పరమైన చిక్కుముళ్ళను ఎట్లా విప్పుతారో స్పష్టం చెయ్యక తప్పదు!

371-డి రాష్ట్ర ప్రమేయం కోరుతుంది:

371-డి మన రాష్ట్రం తీర్మానం మీద ఏర్పడిన ప్రత్యేక అధికరణం. రాష్ట్రాల స్థానిక అవసరాలకు, అస్తిత్వ పరమైన సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కుల కారణంగానే - 371- డి వెలుగు లోకి వచ్చింది. 1969-72 ఉద్యమాల నేపథ్యంలో మనం రూపొందించుకున్న 6 సూత్రాల పథకంలో భాగంగా జోనల్ రిజర్వేషన్లు ఏర్పరుచుకున్నాం. వాస్తవానికి అవి అప్పటికే అమలులో ఉన్న భారత రాజ్యాంగ నియమాలకు విరుద్ధం. కేంద్ర - రాష్ట్ర సంబంధాలకు విరుద్ధం. అప్పుడు తలెత్తిన రాజ్యాంగ ప్రశ్నకు పరిష్కారంగా 371 అధికరణం కింద - 7వ షెడ్యూలులో భాగంగా - ఒక సమన్వయ నిర్ణయంగా - 371-డి, ఇ అధికరణాలు ప్రవేశ పెట్టవలసి వచ్చింది. అందుకు మన రాష్ట్రం యొక్క రాజకీయ నిర్ణయాన్ని - ఎకగ్రీవ తీర్మానం ద్వారా - కేంద్రానికి తెలియ చేశాం. వివిధ రాష్ట్రాలలో సగ భాగం ఆమోదం కూడా తీసుకొని, పార్లమెంటులో 2/3వ వంతు ఆధిక్యతతో - 371-డి, ఇ అధికరణాలు రూపొందాయి.
రాష్ట్ర ప్రజల అభిప్రాయం అవసరం:

ఇప్పుడు 371-డి, ఈ లలో మార్పులు, చేర్పులు చెయ్యాలనుకుంటే, నేటి పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతో కూడా ఆ పని చెయ్య లేదు; 50% రాష్ట్రాలు ఒప్పుకున్నా కూడా ఆ అధికరణాలు రద్దు కావు! ఆ అధికరణంలో మార్పులు, చేర్పుల కొరకు మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీకి - పంపించ వలసిందే! అంటే, ఇక్కడి ప్రజల సర్వ సమ్మతితోనే - వాటి రద్దు కానీ, సవరణ గానీ సాధ్యమవుతుంది. 

371-డి సర్వ సామాన్యమైన అధికరణం కాదు. అది కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న రాజ్యాంగ అధికరణం. దానికి ఉన్న చారిత్రిక నేపథ్యం, గత నాలుగు దశాబ్దాలుగా అదే అధికరణం కింద తమ జీవితాలను మలచుకున్న కోట్లాది ప్రజల ఆకాంక్షలు - 371-డి ని అభేద్యమైన కంచుకోటగా మలిచాయి. సర్వసామాన్య ప్రాజానీకమంతా ముక్త కంఠంతో 'తెరుచుకో ససేమ్' అంటే తప్ప - ఆ అధికరణాలను అంటుకోవడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు!

రాష్ట్ర విభజన అనే ఒక అసంబద్ధ, అప్రజాస్వామిక వాదం - రాజకీయ అవకాశవాదంతో జత కలిపి , దూకుడుగా ముందుకు దూసుకుబోతున్న పరిస్థితిని 371-డి ఖచ్చితంగా అడ్డు కొంటుంది. రాహల్-మోడీ కూడబలుక్కొని ఈ ప్రజాస్వామిక అత్యాచారానికి పూనుకోవడాన్ని నిరోధించడానికి 371-డి బ్రహ్మాస్త్రం గానే పని చేస్తుంది. నమో - రాగాలు ఉభయులూ కలిసి రాజ్యాంగా ధిక్కారం చేస్తే జనం సహించి ఊరుకోరు!

రాజ్యాంగ నిబద్ధతలన్నీ కాలరాచి నిరంకుశంగా వ్యవరించడానికి అధినేత్రి, ఆమె వందిమాగధులు పూనుకుంటే, బీజేపీ అధినేత కూడా విచక్షణ మరచి, అట్టి రాజ్యాంగ ధిక్కారానికి అనుమతి ఇస్తే, అంతా కలసి, అడ్డగోలుగా రాజ్యాంగ సవరణకు బరితెగిస్తే - దొంగ దెబ్బ తీయడం సాధ్యమవుతుందేమో కానీ, న్యాయపూర్నంగా రాష్ట్ర విభజన కుదరదు. సర్వ సాధారణ ప్రజాస్వామిక, న్యాయ సూత్రాలకు, ధర్మబద్ధతకు ఏ మాత్రం గౌరవం ఇచ్చినా - రాష్ట్ర విభజన అసంబద్ధం, రాజ్యంగా విరుద్దం, అనైతికం అని గ్రహిస్తారు! ఇక్కడి ప్రజల సర్వ సమతి లేకుండా రాష్ట్ర విభజన జరగదు! కాదని, ధర్మాన్ని తోసిరాజనీ చేసేది విపక్ష, ప్రతిపక్షాలు కలిసి చేయగలిగింది సామూహిక అత్యాచారం మాత్రమే!

Saturday, November 2, 2013

అడ్డదారులు మానండి! జనాభిప్రాయం తీసుకోండి!

కేంద్ర మళ్ళీ అఖిల పక్షం ఆట మొదలు పెట్టింది. ఇది పచ్చి రాజకీయ క్రీడ! cwc నిర్ణయం ముందే అఖిల పక్షం నిర్వహించి ఉంటే ... అది రాజకీయ ప్రక్రియలో ఒక భాగంగా నప్పేది. విభజన లాభం అంతా సొంతంగా పొందాలన్న స్వార్థంతో - ఆ రాజకీయ ప్రక్రియను అర్థాంతరంగా ముగించింది. తర్వాత - అరాచక పద్ధతిలో విభజన కాండ - కొనసాగించింది.
విభజన అడ్డగోలుగా జరుగుతోందని లోకం అంతా కోడై కోసిన తర్వాతే, విభజన రాజ్యాంగ ప్రక్రియకు భిన్నంగా నడిపిస్తున్నారన్న విమర్శకు లోనైనా తర్వాతే, విభజన తతంగంలో పారదర్శకత, ప్రజాస్వామ్య స్ఫూర్తి నశించాయని జనం గగ్గోలు పెట్టిన తర్వాతే, కేంద్రం ఇప్పుడీ 'అఖిల పక్ష నాటకానికి' తెర తీసింది! కానీ, ఈ 'అఖిల పక్షం మంత్రం' పని చెయ్యదు! జరగదు! అట్లాంటి చొరవకు కాలదోషం పట్టించింది కాంగ్రెస్సే!

అఖిల పక్షం ఒక మోస పూరిత ఎత్తుగడ! అది విభజన సమస్య మీద అఖిల పక్షం కాదు! అది విభజన ఎట్లా జరగాలన్న విషయంపై అఖిల పక్షం! సీమ, తీర వాసులను బలవంతంగా ఎట్లా తన్ని తరిమెయ్యాలో చెప్పటం కోసం ఏర్పాటు చేస్తున్న కుటిల పన్నాగం! అది అయ్యే పని కాదని కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు! అయినా జనాన్ని మభ్యపెట్టడానికే ఈ కొత్త రాగం అందుకొంది! నిజానికి ఇపుడు నిర్వహించవలసింది అఖిల పక్షం కాదు; అఖిల ప్రజానీకం మనసు తెలుసుకునే 'జన పక్షం'! ఈ అఖిల పక్ష డ్రామాలను జనం అంగీకరించరు.

పార్టీలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వైకాపా ఇప్పటికే జెల్ల ఇచ్చింది; తెదేపా ఛీ కొట్టింది; లోక్ సత్తా జీవోయం బాయ్ కాట్ చేసింది కాబట్టి జీవోయంకు కొనసాగింపైన ఈ అఖిల పక్షాన్నీ పో పొమ్మనే అంటుంది! అదే కారణంగా సీపీఎం, ఎమ్మైఎమ్ కూడా గైరాజరవుతాయి. ఇక తెరాసా, బీజేపీ , కాంగ్రెస్ కూచ్చొని ఏమి చేస్తాయి? కాబట్టి ప్రకటనతోనే ముగిసిపోయే అఖిల పక్షమే ఇది. మరో వారం కాలక్షేపం!

అయినా, కేంద్రానికి ఈ అడ్డ దారులు ఎందుకు - రాజ మార్గం ఉండగా! రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచి 'రాష్ట్ర విభజన' పై కూలంకషంగా చర్చించండి. మీరే చెబుతున్నారు కదా, అసెంబ్లీ అభిప్రాయం బైండింగ్ కాదని! మరి భయమేల?! రండి ప్రజా దర్బారుకి!! మోమాటం లేకుండా స్పష్టంగా మాట్లాడుకుందాం-

అఖిల పక్ష సమావేశాలు రద్దు చెయ్యండి!



రాష్ట్ర విభజన విషయంలో పార్టీల అభిప్రాయం కోరుతూ - మంత్రుల బృందం - అఖిల పక్ష సమావేశాలు ప్రకటించడాన్ని మేము తప్పుబడుతున్నాం. రాష్ట్రంలో ఈనాడున్న పరిస్థితులలో అన్ని పార్టీలూ ప్రాతినిధ్య అస్తిత్వం కోల్పోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీలు ప్రజల విశ్వసనీయత కోల్పోయాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్న మేము, మా తరఫున మాట్లాడటానికి ఏ పార్టీనీ అనుమతించడం లేదు!
మేము ఒక పార్టీకి కానీ, ఎమ్మెల్యే కి కానీ, ఎంపీకి కానీ వోటు వేసింది ప్రపంచంలోని అన్ని సమస్యలకూ - మా తరఫున ప్రాతినిధ్యం - అప్పగించేందుకు కాదు! కేవలం చట్ట సభలలోమా నియోజక వర్గ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వ్యవహరించుకోమని మాత్రమే! రాష్ట్ర విభజన విషయంలో పార్టీలు ప్రైవేటుగా తీసుకునే నిర్ణయాలకు - ప్రజలకు సంబంధం లేదు! అట్లాంటి నిర్ణయం ఏదైనా చట్ట సభల్లోనే జరగాలి! అక్కడి నిర్ణయాలనే పాక్షిక ప్రజాభిప్రాయంగా గ్రహించవచ్చు! రాష్ట్ర విభజన శాశ్వత మార్పు!
రాష్ట్ర విభజన వంటి విషయాలలో కేవలం చట్ట సభల అభిప్రాయం కూడా చాలదు! భవిష్యత్ తరాలకు సంబంధించిన శాశ్వత పరిణామాలకు దారి తీసే రాష్ట్ర విభజన నిర్ణయమ విషయంలో - జన సామాన్యం అభిప్రాయం తీసుకోవాల్సిందే! వివిధ ప్రజా సంఘాలు, వివిధ సెక్షన్లకు చెందిన ప్రతినిధుల అభిప్రాయం అనివార్యంగా తీసుకోవాలి!
రాష్ట్ర విభజనే వద్దని 8 కోట్ల ప్రజానీకం కోరుతున్నారు. ఆ పాపులర్ ప్రజాభిప్రాయాన్ని తోసిరాజని పార్టీల ప్రైవేట్ ఉత్తరాలను రాష్ట్ర విభజనకు ప్రాతిపదికగా తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఒకవేళ పార్టీలన్నీకలిసి దేశాన్ని అమ్మేయడానికి తీర్మానిస్తే అది చెల్లుతుందా? మమ్మల్ని అమ్మేయడానికి ఏ పార్టీకీ మేము దస్తావేజులు రాసి ఇవ్వలేదు! కనుక అఖిల పక్ష సమావేశాలు తక్షణమే రద్దు చెయ్యండి. మా దృష్టిలో ఈ సమావేశాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే మోసపూరిత చర్యలు మాత్రమే! అసెంబ్లీలో ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు వ్యక్త పరచే ప్రజాభిప్రాయం "కట్టుబాటు" కాదని ప్రకటిస్తున్న వాళ్ళు, ఆయా పార్టీల సొంత సంస్థాగత అభిప్రాయాలు మాత్రం ఎట్లా "కట్టుబాటు" అవుతాయో చెప్పాలి! ఏ రాజ్యాంగ అధికరణంలో అట్లా రాసి ఉందో స్పష్టం చెయ్యాలి!
వివిధ రాజకీయ పార్టీలు స్వేచ్చగా పని చేసే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. కొన్ని చోట్ల నిర్బంధ పరిస్థితులు ఉన్నాయి. పార్టీలను తరిమి కొడుతున్న దుస్థితి ఉంది. తీవ్రమైన విద్వేషాలు రెచ్చగొట్టబడిన విషమ వాతావరణంలో ఆయ పార్టీలు ఒత్తిడితో, నిర్బంధంతో వ్యక్తం చేసే అభిప్రాయాలు కనీసం 'విస్తృత రాజకీయ అభిప్రాయంగా కూడా" స్వీకరించడం కూడా తప్పే! ఈ సందర్భంలో - కేవలం రాజ్యాంగ పరమైన విధి విధానాలనే - జాతీయ మార్గదర్శకాలు, సంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలి!
రాజ్యాంగ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి:
రాష్ట్ర విభజన అసెంబ్లీకి - రాష్ట్రపతికి - పార్లమెంటుకి మధ్య విషయం. దీనిలో కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ నడిపే ఏజెన్సీగా ఉండాలే కానీ తానే న్యాయ నిర్ణేతగా ఉండ కూడదు. మంత్రుల బృందం రూపొందించిన రిఫరెన్సు అంశాలు - తెలంగాణా ఏర్పడి పోయిందన్న నిర్ధారణతో - ఉన్నాయి. ఇది సరాసరి అక్రమం, అన్యాయం. వాటిని మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాం. తీర్పు ఇవ్వడానికి మంత్రుల బృందానికి కానీ, కేబినెట్ కి కానీ అధికారం లేదు! తీర్పు ఇవ్వవలసినది పార్లమెంటు! పార్లమెంటుకు ప్రతిపాదన వెళ్ళకుండానే - తీర్పు ఇవ్వడం, దాన్ని అమలు చేసెయ్యడం - రాజ్యాంగ విరుద్ధమే కాదు, పార్లమెంటుకు అవమానం కూడా! ప్రతిపాదనకు - తీర్పుకూ తేడా లేకుండా - చేస్తున్న ముసిగుమ్మిడి వ్యవహారాలు ఇక కట్టిపెట్టండి.
రాష్ట్ర విభజన విషయంలో అన్ని రకాల ప్రజాస్వామిక విలువలనూ అతిక్రమించిన ప్రభుత్వం - ఇపుడు నాటకీయంగా - అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చెయ్యడం తెలుగు ప్రజలను అవమానించడమే! ఈ దుర్మార్గపు ఎత్తుగడలను తక్షణమే ఉపసంహరించుకోండి!

Thursday, October 17, 2013

371డి అధికరణ ఏమిటి: విభజనకు మెలికనా?

                    
                      నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం చేసిన రాజ్యాంగ సవరణ దరిమిలా తెరమీదకు వచ్చిన 371డి అధికరణ రాష్ట్ర విభజనకు గుదిబండగా మారుతుందనే చర్చ సాగుతోంది. నిజంగానే అది గుదిబండగా మూరుతుంది. అది విభజన ప్రక్రియలో మెలిక అవుతుందా అనేది చూడాల్సి ఉంది. ఈ అధికరణపై ఓ న్యాయవాది కోర్టుకు వెళ్లాడు. రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రత్యేకవాదం ఉవ్వెత్తున సాగిన నేపథ్యంలో మధ్యే మార్గంగా కేంద్రం ఆంధ్రా, రాయలసీమ, తెలం గాణ ప్రాంతాల మధ్య సమతుల్యత వుండాలని కేంద్రం భావించింది.       ఈ క్రమంలోనే ఉద్యోగ, ఉపాధి, ఇత్యాది రంగాలకు 371డి ఆర్టికల్‌ ద్వారా 1973లో మార్గ దర్శకాలను రూపొందించింది. పబ్లిక్‌ సర్వీసెస్‌లలో మూడు ప్రాంతాలలో సమాన స్థాయిలో అవకాశాలు కల్పించాలని ఈ అధికరణ తెలియజేస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించే విధంగా రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలో ఉద్యమం ఎగిసినపడిన ఫలితం అది ముందుకు వచ్చింది.
                 
                 అప్పటి పరిణామాలలో భాగంగానే ఆర్టికల్‌ 371 డి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ సీట్లను ఓపెన్‌ కేటగరీలో 54 శాతం వుండాలని నిర్దేశించడం జరిగింది. అదే విధంగా ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి.లకు సంబంధించి 46 శాతం వుండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అదే విధంగా 1974 నాటి ప్రెసెడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం స్థానిక అభ్యర్థులకు 85 శాతం, నాన్‌ లోకల్‌ కేటగరీలో 15 శాతం అమలు చేయాలని నిర్దేశించడం జరిగింది. దాని ఫలితంగా రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పడింది. దాంతో రాష్ట్రంలో ఆరు జోన్లు ఏర్పడ్డాయి. ఈ ఆర్టికల్‌ను ఆయుధంగా చేసుకుని రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ఏపిఎన్జీవో నేతలు భావిస్తున్నారు. దాన్ని రద్దు చేస్తే గానీ రాష్ట్ర విభజన సాధ్యం కాదు. దాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని, అందుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని చెబుతూ వస్తున్నారు. అయితే, ఉద్యోగాల్లో సమానావకాశాల కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 371డి అధికరణ చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన చేసే సమయంలో రాష్ట్రపతి ఆ ఉత్తర్వును ఉపసంహరించుకుంటే సరిపోతుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఓ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

విభజన అంత సులభం కాదు!

ఆర్టికల్ 371(డి) ని ముట్టుకుంటే కాటేస్తుంది!
ఆర్టికల్ 3 ఆంధ్ర ప్రదేశ్ విషయంలో - ఒక అత్తిపత్తి మొక్క లాంటిది. ముట్టుకుంటే ముడుచుకు పోతుంది. దానికి ఆ లక్షణం ఆర్టికల్ 371-డి వలన వచ్చింది. 371డి - ఆర్టికల్ 3 నెత్తి మీద కూర్చుంది-శివుడి తల మీది పాములా. శివుడాజ్ఞ లేకపోయినా చీమ కుట్టవచ్చు కానీ, 371-డి ని కాదని ఆర్టికల్ 3 ముందుకు కదలదు! కాదని ముట్టుకొంటే, 371-డి బుస్సు మని పడగ విప్పుతుంది. ఇప్పుడీ 371డి - విషయంలో కేంద్రం ఏమి చెయ్యబోతోంది? ఏమి చెయ్య బోతున్నారో తేల్చి చెప్పమని ముఖ్యమంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఆ మేరకు సీయస్ మహంతి కేంద్రానికి లేఖ రాశారు. అటునుంచి ఇంతవరకు ఉలుకూ పలుకూ లేదు!

1973లో రాజ్యాంగానికి చేసిన 32వ సవరణ వలన 371-డి అధికరణ వచ్చింది. జూలై 1974 నుంచి అది అమలులోకి వచ్చింది. 371(1) రద్దు చేసి 371డి అమలులోకి తెచ్చారు. మళ్ళీ దాన్ని మార్చాలన్నా, రద్దు చెయ్యాలన్న - కేవలం - రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వీలవుతుంది. అందునా, అట్లాంటి మార్పులు చేర్పుల వలన ప్రభావితమయ్యే అసంఖ్యాక ప్రజానీకం వ్యతిరేకించేటప్పుడు - రాజ్యాంగ సవరణ ఆషామాషీగా చెయ్యడానికి వీలు కాదు. రాజ్యాంగ సవరణ అంటే - పార్లమెంటులోని 2/3 వంతు ఆధిక్యం కావాలి. పార్లమెంటు ముగిసిపోతున్న వేళ ఇప్పుడీ రాజ్యాంగ సవరణ సాధ్యమయ్యే పని కాదు!

371డి ఇప్పటికే రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చింది. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ 'ఒకే రాష్ట్రం' కాదు. ఇది ఆరు ఉప రాష్ట్రాల సమాఖ్య. అందులో హైదరాబాద్ ఫ్రీ జోన్. అంటే - తెలుగువాళ్ళందరికీ శాశ్వత రాజధాని. ఈ శాశ్వత ఏర్పాటుకు గ్యారంటీ ఇచ్చింది 1956 రాష్ట్రాల ఏర్పాటు చట్టం. కాబట్టి - రాష్ట్ర విభజన అంటే - కేవలం పరిపాలనా పరమైన అంశం కాదు. ఇది ప్రజల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమూ అందుకు సాహసించ లేదు, కూడదు!

371డి- ఏమంటోంది: “the provisions of this Article and of any order made by the President thereunder shall have effect notwithstanding anything in any other provision of this Constitution or in any other law for the time being in force.” కాబట్టి ఇతరత్రా చట్టలన్నిటికీ అతీతంగా 371-డి పని చేస్తుంది.

కొంతమంది అంటున్నారు: 371-డి కేవలం తెలంగాణా కోసం పెట్టిన చట్టం కనుక తెలంగాణా వాళ్ళందరూ ఒప్పుకుంటే, దాన్ని పక్కన పెట్టవచ్చని. తెలంగాణా వాళ్ళందరూ - 4 కోట్ల మందీ - సంతకాలు పెట్టినా, దాన్ని పక్కన పెట్టగలరా అన్న విషయం అట్లా ఉంచుదాం. నిజానికి 371డి - కేవలం తెలంగాణా సోదరుల కోసమే చేసిన చట్టం కాదు. అది - రాష్ట్రంలో విద్యా ఉద్యోగ విషయాల విషయంలో ప్రజలందరికీ వర్తించే ఒక ప్రత్యేక ఏర్పాటు! 610 జీవో దాని ఆధారంగానే వచ్చింది. 371-డి - ఇలా మొదలవుతోంది: The President may by order made with respect to the State of Andhra Pradesh provide, having regard to the requirements of the State as a whole, for equitable opportunities and facilities for the people belonging to different parts of the State, in the matter of public employment and in the matter of education, and different provisions may be made for various parts of the State.

ఇప్పుడు - 371డి ని - ఉన్నఫళంగా రద్దు చెయ్యడానికి కూడా కుదరదు! 371డి - ఇచ్చిన హక్కులునిరాకరించడం ప్రభుత్వం ఇష్టారాజ్యం కాదు. ప్రజల వ్యతిరేకత మరచి నిరంకుశంగా వ్యవహరించే బలం లేని అర్భక ప్రభుత్వం ఇది. కాబట్టి ఇది 371-డి ని ముట్టుకోలేదు! దీనిపై అభిప్రాయం చెప్పడానికే ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు! 371-డి విషయంలో ఏమి చేసేదీ చెప్పడానికి సమయం తీసుకోవచ్చు - కానీ - ఉపేక్షించడానికి వీలు లేని '6 ముళ్ళ బంధం' 371డి! కాబట్టే - ఆర్టికల్ 3 అత్తిపత్తి మొక్క అయ్యింది! ఇందిరాగాంధీ చాలా ముందు చూపుతో - ఈ 'విడిపోని బంధం' వేసిందని కిరణ్ చెప్పింది అందుకే!

Article 371-D is beneficial for the ignored sections of society and and underdeveloped regions. Article 371-D is meant for unity and empowerment of the people. దీనిపై చర్చే లేకుండా, దీని మార్పు లేదా రద్దు వలన వచ్చే ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అమాంతంగా, ఏకపక్షంగా 371-డి ని తీసి చెత్తబుట్టలో వేసెయ్యడం లేదా పనికిమాలినదిగా మార్చెయ్యడం సాధ్యం కాదు. కోట్లాది ప్రజల తరతరాల హక్కులకు సంబంధించిన ఒక ఏర్పాటును - అమాంతంగా తొలగించి - ఆ ప్రజలను కాశ్మీర్ శరణార్దుల మాదిరిగా మార్చి, మీ చావు మీరు చావండని కుప్ప కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ అక్కుబచ్చి ప్రభుత్వం తరిమేస్తుందా?! Never!

Wednesday, October 16, 2013

రాజధాని పేరు మీదే రాజ్యాలు..?

                        రథసారధిగా మాత్రం ఉండలేనంటాడు.సహజంగా బలమైన నేత వెనుక శక్తివంతమైన అమాత్యుని పాత్రకు ఉండవల్లి సూపర్ గా సరిపోతాడు. రాజు వేరు.. మంత్రి వేరు. రాజుగా తనకున్న శక్తియుక్తులు పరిమితం కాబట్టి.. తన అసంతృప్తిని చెప్పటం మినహా ఆయనింకేమీ చేయటం లేదు.

                          తాజాగా విభజనపై ఒక లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చాడు. అదేంటంటే.. పూర్వం రోజుల్లో కూడా రాజధాని నగరం పేరు మీదే రాజ్యాలు ఉండేవి కానీ.. రాజ్యాల పేరు వేరు.. రాజధాని వేరు అనేవి ఉండంటూ కొత్త పాయింట్ బయటకు తీశారు.అయ్యోధ్య నగర రాజు, హైదరాబాద్ రాజు, మైసూర్ రాజు అని రాజధాని పేరు మీదే పిలిచారని.. అలాంటప్పుడు హైదరాబాద్ ను ఎలా విడదీస్తారని ప్రశ్నించారు.
                          దాదాపు 57ఎళ్లు కలిసి ఉన్నాక.. ఇంకో పదేళ్లు మాత్రమే నీకు హైదరాబాద్ తో లింకు ఉంటుంది.. తర్వాత ఈ నగరం నీది కాదనటం అన్యాయమని ఆక్రోశించారు. దేశ చరిత్రలో 5.5కోట్ల మంది ప్రజల అభిప్రాయం కాదంటూ ఒక ప్రాంతాన్ని రెండుగా విభజించటం చాలా దారుణమంటూ మండి పడ్డారు.

సీమాంధ్రకు ప్యాకేజ్' ఇదే కాంగ్రెస్ ఎన్నికల హామీ!

                   రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ పరిస్థితిని చక్కదిద్దుకునే పనిలో పడింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాన పక్షపాతి అనే భావన వచ్చింది సీమాంధ్రప్రజల్లో. దీంతో అక్కడ ఎవరూ కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. దీన్ని అధిగమించడానికి, వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో పరువు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. 
                  రాష్ట్ర విభజనతో నష్టపోతున్న సీమాంధ్రకు భారీ ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ ప్యాకేజీ కేవలం సీమాంధ్ర ప్రజలను చల్లార్చడానికే కాక.. వచ్చే ఎన్నికల హామీ గా కూడా ఉపయోగపడగలదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ప్యాకేజీలో  నంబర్ ఎంత పెద్దగా ఉంటే.. అది అంతగా సీమాంధ్ర ప్రజలను ప్రభావితం చేస్తుందని, కాంగ్రెస్ కు అంత అనుకూల పరిస్థితిని కల్పిస్తుందని వారు అనుకొంటున్నారు. 
 
                          ప్యాకేజీ అంటే.. ఇప్పటికిప్పడు అందించేదేమీ కాదు. రాబోయే పది సంవత్సరాల పాటు.. ఏడాదికి ఇంత అని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి అప్పటికి రాజెవరో పేద ఎవరో.. ఈ వ్యూహంతోకాంగ్రెస్ అధిష్టానం కేంద్రప్రభుత్వం చేత భారీ ప్యాకేజీని ప్రకటింపజేసే అవకాశాలున్నాయి. ప్యాకేజీ డబ్బును ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు.. అనేది కాంగ్రెస్ కు అనుకూలాంశం. దీన్న ఆయుధంగా చేసుకొని భారీ నంబర్ తో సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తుంది. మరి సీమాంధ్ర ప్రజలు టెంప్ట్ అవుతారా?

సీమాంధ్ర దేశంలో అతి పేద రాష్ట్రంగా నిలుస్తుందా?

                   ఇన్ని రోజులూ టాప్ స్టాండర్డ్స్ లో ఉన్న "ఏపీ'' సీమాంధ్ర రూపంలో చివరాఖరుకు పడిపోతుందా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.
                  ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోవడం.. అంటే సీమాంధ్ర ప్రజలకు ఒక శిక్షలాంటిదేనని.. అక్కడి జనాభాకు, ఆర్థిక వనరులకు చాలా వ్యత్యాసం ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దుర్మార్గంగా తయారవుతుందని..  హైదరాబాద్ లాంటి ఆర్థిక వనరు దూరం అవ్వడం సీమాంధ్ర ప్రభుత్వానికి కష్టాలను, కడగండ్లను మిగులుస్తుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలదే ముఖ్య వాటా అని.. ఇప్పుడు ఈ రెండు జిల్లాలూ దూరం అవ్వడంతో.. సీమాంధ్ర ఖజానాకు కాసులు వచ్చే అవకాశాలే ఉండవని వారు అంటున్నారు. 
                ఇదిచాలాదన్నట్టుగా వచ్చే పదేళ్లో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఏ స్థాయిలో ఇస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు! గత చరిత్రను పరిశీలిస్తే.. ఇంత వరకూ ఏర్పాటు చేసిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతుందని.. కేంద్రం వద్ద కూడా డబ్బు లేదని.. నిధుల విడుదలలో జాప్యం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా ఏ విధంగా చూసినా.. కొత్త రూపు సంతరించుకోనున్న  సీమాంధ్రకు ఆర్థిక విషయాల్లో అంతులేని కష్టాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పక్కా తెలంగాణలో పత్తాకోల్పోయిన కేసిఆర్

                   పక్కా ప్యూర్ తెలంగాణలో కేసిఆర్ పత్తా కోల్పోయాడు అంటున్నారు, ఈ వార్త ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తెలంగాణ వాదం అత్యదికంగా ఉన్నదే ఉత్తరతెలంగాణలోని నాలుగుజిల్లాలో. అటువంటి ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్ పరిస్థితి దాదాపు జీరో లెవల్ వచ్చిందంటున్నారు. ఒక వరంగల్ జిల్లా మినహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో కేసిఆర్ పార్టీ టిఆర్ఎస్ పరిస్తితి ఘోరంగా తయారైంది అంటున్నారు.
              కరీంనగర్ లో కాస్తా బలం తగ్గింది కాని ఇంకా పూర్తిగా టిఆర్ఎస్ దెబ్బ తినలేదని, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం దాదాపు జీరో అయింది అంటున్నారు. ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ వర్గాలే పేర్కొనడంతో దీనికి బలం చేకూరుతోంది. పైగా ఇది నమ్మడానికి అవకాశాలు కూడా ఎక్కువే. ఎందుకంటే...
బిజేపి తెలంగాణకు అనుకూలమని కుండబద్దలు కొట్టి చెప్పడం, కేసిఆర్ వైఖరి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ముందునుంచి బిజేపి బలం ఉంది. మహబూబ్ నగర్ లో ఉప ఎన్నికల్లో బిజేపి గెలిచి అక్కడ సత్తా చాటుకుంది. ఇక జిల్లా రాజకీయాల్లోనే తిరుగులేని నేతగా పేరున్న నాగం జనార్దన్ రెడ్డి బిజేపి లో చేరడంతో ఇక్కడ బిజేపి మరింత పుంజుకుంది. పైగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తెలంగాణ వాదం బలంగా ఉన్నప్పుడు కూడా టిఆర్ఎస్ హవా తక్కువనే.
                 ఈ మూడు జిల్లాల్లో టిడిపిదే పైచేయి. అయితే చంద్రబాబు తన వైఖరితో తెలంగాణ ప్రజల్లో విలన్ గా మారడంతో ఈ జిల్లాలో ఉన్న బలమైన తెలుగుదేశం నేతలంతా బిజేపి వైపు చూస్తున్నారట. పైగా తెలంగాణ వచ్చాక కేసిఆర్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తాడు అన్న వార్తలు టిఆర్ఎస్ పరిస్థితిని మరింత దిగజార్చాయి. కాంగ్రెస్ నేతలు బలంగా ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో  ఉన్న టిఆర్ఎస్ నేతలు ఇక మనపని ఖతమే అంటూ వారు కూడా బిజేపి వైపు  చూస్తున్నారని సమాచారం. దీంతో తెలంగాణలో టిఆర్ఎస్ పరిస్తితి పత్తాలేకుండా పోతోంది అన్నదానికి బలం చేకూరుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ సీమ, ఆంధ్రుల మధ్య చిచ్చు..!

                    ఇద్దరు కలిసి కట్టుగా ఉంటే వారిని ఓడించడం,దెబ్బతీయడం అంత సులభం కాదు.. అందుకే ముందుగా వారిని రెండుగా విడదీసి.. తర్వాత ఓడించు..అనేది బ్రిటీషు వాడు చెప్పిన రాజకీయ నీతి. భారతదేశంలో పాగా వేయడానికి బ్రిటిషర్లు  ఈ నీతినే ఫాలో అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఇదే దిక్సూచి అవుతోంది. తమకు రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత పరిస్థితులు కనిపిస్తున్న సీమాంధ్ర ప్రాంతాన్ని.. సమైక్యాంధ్ర అంటూ ఏకతాటిపై నిలబడుతున్న ఆ ప్రాంతాన్ని విడదీయడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ రంగం సిద్ధం చేస్తోంది. 
ఈ విషయంలో వారు 'రాజధాని' అంశాన్ని అస్త్రంగా చేసుకొన్నారు. ఇక విభజనపై వెనక్కు తగ్గమని స్పష్టం చేసిన కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు రాజధాని అనే ఫుట్ బాల్ ను ఇచ్చి తన్నుకొమ్మని సీమాంధ్ర నేతలకు అదేశించే అవకాశాలున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి షిండే వ్యాఖ్యల్నీ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారని విలేకరులు అడిగితే కేంద్ర హోం మంత్రి షిండే సమాదానం చెబుతూ అది ఆ ప్రాంత ప్రజలు, నేతలు నిర్ణయించుకోవాల్సిన విషయమని అన్నారు.
                      ఇది చాలు సీమాంధ్ర నేతల మధ్య విభేదాలు మొదలవ్వడానికి.. కాంగ్రెస్ అధిష్టానం అనుచరులు ఉండనే ఉన్నారు. వారు రాజధాని మా ప్రాంతంలో ఉండాలి.. అంటే మా ప్రాంతంలో ఉండాలి..అంటూ వాదన మొదలుపెట్టే అవకాశాలున్నాయి. వారితో పాటు ప్రజలు కూడా డైవర్ట్ అవతారు. అప్పుడు సీమాంధ్రలోసమైక్యాంధ్ర ఉద్యమం కాకుండా. .రాజధాని ఉద్యమం మొదలువుతుంది! కాంగ్రెస్ హైకమాండ్ సేఫ్ జోన్ లోకి వెళుతుంది. విభజన గురించి వ్యతిరేకత తగ్గుతుంది.. రాజాధానిని ఏర్పాటు చేయడమో లేక.. సీమాంధ్రను మళ్లీ రెండు ముక్కలు చేయడమో.. చేస్తారు! విభజించు పాలించు సిద్ధాంతం కాంగ్రెస్ ను సేఫ్ జోన్ లోకి నెట్టేలా ఉంది!

Tuesday, October 15, 2013

ఫ్లాష్ న్యూస్ : త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఔట్ – తెలంగాణ డౌట్

             ఫ్లాష్ న్యూస్.... త్వరలోనే కేంద్రప్రభుత్వం మైనార్టీలో పడనుంది, ప్రభుత్వం గద్దె దిగనుంది. ఈ మాటలు ఏకంగా కేంద్రమంత్రి, యూపిఏ లో కీలక భాగస్వామి అయిన శరద్ పవార్ తెలిపారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కేంద్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని, ఎన్నికలు తెలంగాణ ఏర్పాటుకు ముందుగానే వస్తాయని చెప్పారు. దీంతో ఇది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
            తన రాజీనామా ఆమోదం కోసం లగడపాటి రాజగోపాల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించనుందని శరద్ పవార్ మాట. దీంతో రాజీనామాలు చేసిన మిగతా ఎంపీలవి కూడా  ఆమోదించాల్సి వస్తుంది, అంతే కాదు అవి ఆమోదించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారట. ఇదే జరిగితే కేంద్రంలో యూపిఏ సర్కారు మైనార్టీలో పడిపోతుంది. పలితంగా ముందస్తు ఎన్నికలకు వెల్లాల్సిందే అంటున్నాడు శరద్ పవార్.
            పైగా అత్యంత సంక్లిష్టంగా మారిన తెలంగాణ సమస్యను తప్పించుకోవాలన్నా, దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నా ఇదే సరైందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. అందుకే తెలంగాణ ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు వేస్తోంది, ఈ దశలో దానికి నిరసనగా సీమాంద్రకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు రాజీనామాలు చేస్తారు, ఇప్పటికే దాదాపు మొత్తం మంది చేసారు, మిగిలిన వారు చేస్తారు, లగడపాటి రాజీనామా సాకు చూపి అందరివి తప్పనిసరిగా ఆమోదించాల్సి వస్తుంది.
            దీంతో సర్కారు మైనార్టీలో పడిపోయి ఇక ఎన్నికలకు వెల్లాల్సి వచ్చిందని, ఎన్నికలయ్యాక తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికలను ఎదుర్కుంటుంది. దీంతో ఏపిలో తమ విభజన నిర్ణయం  ఎంత వరకు పనిచేసింది, జగన్, చంద్రబాబు, కేసిఆర్ ల అసలు సంగతేంటి, వారి బలం ఎంతో కూడా తెలుస్తుంది, దానిని బట్టి తెలంగాణపై ముందుకు పోవచ్చు, అదృష్టం బాగాలేక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక చిక్కే ఉండదనుకోండి. అయితే ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట, పరిణామాలు ఎలా ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది ఎదిరిచూడాలి.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే "తెలంగాణ''!

    
        వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపిస్తేనే తెలంగాణ ప్రక్రియ పూర్తి అవుతుందా? లేకపోతే తెలంగాణ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందా? రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎన్నికలు ప్రధాన అడ్డంకి కాబోతున్నాయా? ప్రస్తుత పరిస్థితుల్లో కలుగుతున్న అనుమానాలివి. కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోంది.. అన్న వార్తల నేపథ్యంలో ఈ అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో కాంగ్రెస్ గేమ్ ప్లాన్ కూడా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 
         రాష్ట్ర విభజనతో సీమాంధ్రలోకాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది.. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ విషయంపై అవగాహన ఉంది. మరి తెలంగాణ ఏర్పాటు వల్ల ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ సీట్లను దక్కించుకొనే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొనే అవకాశాలున్నాయి. అందులో ముఖ్యమైనది ఎన్నికల ముందే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించకపోవడం, ఈ ప్రక్రియను పెండింగ్ లోనే పెట్టి ఎన్నికలకు వెళ్లడం.
తద్వారా తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ పరువు దక్కించుకోవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఆశిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నేతలు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారు. దీని వల్ల ఇక్కడ అన్నో ఇన్నోసీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఇక సీమాంధ్ర నేతలకు జనాల్లోకి వెళ్లే ధైర్యం లేదు. మరి వారికి దాన్ని అందించాలంటే.. తెలంగాణ ప్రక్రియ నెమ్మదించాలి. ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజనను పూర్తి చేస్తే.. అందుకు పర్యవసనాలను ఎన్నికల్లోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే తెలంగాణ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. సీమాంధ్ర నాయకులకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇక తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ ప్రకటించామని.. వచ్చే ఎన్నికల్లో మాకే అధికారం ఇస్తే తెలంగాణ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇస్తుంది. ఇది కాంగ్రెస్ గేమ్ ప్లాన్.

Saturday, October 12, 2013

Friday, October 11, 2013

Thursday, October 10, 2013

రాష్ట్రపతి పాలనకే రంగం సిద్ధమా?


రాష్ట్రపతి పాలనకే రంగం సిద్ధమా?


తెలంగాణాపై వెనక్కు తగ్గేదే లేదు - ఎన్నికల సంగతి తర్వాత తేల్చు కుందాం. తెలంగాణా విషయంలో లొంగిపోతే, దేశంలో ఇక ఎవ్వరూ మనల్ని లెక్క చెయ్యరు - అనే భావోద్వేగంలో మేడం పడిపోయినట్లు కనిపిస్తోంది.

వీలయితే, అసెంబ్లీకి బిల్లు పంపించాకుండానే - నేరుగా పార్లమెంటులో ప్రవేశపెట్టి - రాష్ట్రాన్ని రెండుగా చీల్చి వెయ్యడమే ఉత్తమం - అని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాజ్యాంగ ప్రక్రియను జవదాటం - బిల్లు అసెంబ్లీకి రెండు మార్లు వస్తుం; అంతా పధ్ధతి ప్రకారమే చేస్తాం - అని దిగ్విజయ్ సింగ్ - నిన్న ప్రకటించాడు. అయితే, వెంటనే హొమ్ శాఖ దానికి స్పందించింది. ప్రక్రియ ఎట్లా ముందుకు సాగుతుందో ఇంకా నిర్దిష్టంగా నిర్ణయం కాలేదు; ఇంకా ఏమే నిర్ణయం కాలేదని. ఆయనకీ క్లాసు తీసుకుంటారు అన్నట్లుగా రాజధానిలో గుప్పుమంది.

అసెంబ్లీని బైపాస్ చెయ్యాలంటే, రాష్ట్రపతి పాలన ఒక్కటే శరణ్యం. ఆ తర్వాత - ప్రక్రియ అంతా తూతూ మంత్రం చందమే! రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో - ఏవో కుంటిసాకులు చూపి - రాష్ట్రపతి పాలన పెట్టినా - అదికొరివితో తల గోక్కోవడమే అవుతుంది. ప్రజలనిలా వరుసగా అవమానాల పాలు చేస్తే, జనం హద్దులు మీరతారని కేంద్రం గ్రహించాలి. ఇప్పటికే చాలా తప్పులు చేసిన కేంద్రానికి రాష్ట్రపతి పాలన చివరితప్పు అవుతుంది.

తెలంగాణా విషయంలో పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న కేంద్రం - ఆ చివరి తప్పు చెయ్యడం నుంచి తనను తాను నిగ్రహించుకోలేక పోవచ్చు! అయితే, రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించక పోవచ్చు పైగా. కొత్త రాష్ట్రాల ఏర్పాటు వలన వచ్చే డామినో ఎఫెక్ట్ గురించి కూడా ఆయన హెచ్చరించవచ్చు. అయినా తెలంగాణా విషయంలో ఎవరి మాటా వినను! అని మేడం అంటే ... ప్రాప్త కాలజ్ఞత నశిస్తే ... "వినాశ కాలే విపరీత బుద్ధి!" అన్నది రుజువుకాక మానదు!