Menu bar





Showing posts with label gallery. Show all posts
Showing posts with label gallery. Show all posts

Friday, November 8, 2013

'విభజన'కు తెలుగేతర శక్తులు కుట్రపన్నుతున్న వేళ ...



               దేశ స్వాతంత్ర్యానంతరం భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ముందు ఆంధ్రరాష్ట్రంగా, ఆ పిమ్మట తెలుగుప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను కలుపుకుని మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి పురోభివృద్ధి చెందుతున్న తెలుగుజాతిని బలవంతంగా విడగొట్టే ప్రయత్నంలో చరిత్రలో మొదటిసారిగా జాతీయ కాంగ్రెస్ లోని, దాని కేంద్రప్రభుత్వంలోని తెలుగేతర శక్తులన్నీ ఏకమవుతున్న వేళ జాతి యావత్తు - మూడుప్రాంతాలలోని తెలుగుప్రజలూ ముప్పేటగా ప్రతిఘటించవలసిన తరుణం ఎప్పటికన్న కూడా ఇప్పుడు వచ్చింది; తెలుగుజాతి ఉనికిని భంగపరిచే కుట్రకు తెలుగేతరులతో చేతులు కలిపిన స్వార్థపరులూ, విద్రోహులూ తెలుగువారి మధ్యనే ఉండటం ఏమాత్రం సహించరాని పరిణామం. "ఇంటిదొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడ''న్న సామెత వచ్చింది! ఈ ఇంటిదొంగల విద్రోహాన్ని కనిపెట్టిన తెలుగేతర శక్తులు ఆ దొంగల్ని వినియోగించుకుని "2009 డిసెంబర్ 9''న ఢిల్లీనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజం నాటేందుకు ముందుకొచ్చారు. ఈ "విభజన'' ప్రాతిపాదనకు కారకులైన స్థానిక విద్రోహులు ముగ్గురూ పచ్చి పదవీ కాంక్షాపరులూ, స్వార్థపరులూ, రాజకీయ నిరుద్యోగంతో "లంఖణాలు'' పడుతూ వచ్చిన సీమాంధ్రులే కావటం మరీ దారుణమైన పరిణామం. ఈ ముగ్గురూ జాతి చరిత్ర, దేశచరిత్రా తెలియని మూర్ఖులే.

            వీరిలో ఒకరు ఒక స్థానిక పార్టీకి అధ్యక్షుడూ, మాజీ ముఖ్యమంత్రీకాగా, మరొకరు మరో స్థానిక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న ఒక మాజీమంత్రి, పచ్చి అవకాశవాదే గాకుండా ఒక ప్రాంతానికి ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి పదవికి 'ఏతాం' ఎత్తిన 'దొర', ఇంకో నాయకుడు లాడ్జింగ్ ల వ్యాపారంలో రకరకాల వ్యాపకాల కోసం లాడ్జింగ్ ల నిర్వహణలో కాకలు తీరడం ద్వారా రాజకీయాల్లోకి దూసుకువచ్చిన మహానుభావుడు, ఒక స్థానిక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడూ! వీరిలో ఒకరు తెలంగాణాకు వలసవచ్చి స్థానిక ప్రజల్ని దోపిడీ చేయడంలో మొనగాడుగా మారి, ఆ సంపదను రక్షించుకునేందుకు ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణా ప్రజల్ని ముఖ్యంగా దళితవర్గాల ప్రజలను నానాయాతనలు పెట్టడానికి 'ఉద్యమిం'చినవాడు; ఆ పదవీ స్వలాభం కోసం తోటి తెలుగు యువకులను, నిరుద్యోగ యువతను పచ్చిఅబద్ధాలతో తెలుగుజాతికే వ్యతిరేకంగా అనేక ప్రలోభాలతో ఉద్రేకపరిచి, బలవంతాన వందలాది మందిని ఆత్మహత్యల వైపు ప్రోత్సహించిన వాడు; ఆ క్రమంలో ఆ నేరం ఫలితంగా తనకు శిక్షలు పడకుండా తప్పించుకో జూస్తున్నాడు! ఈ ముగ్గురూ ఎవరో ఈసరికే అర్థమైపోయి ఉండాలి.

          ఈ ముగ్గురు తెలుగు "మరాఠీ''ల వ్యవహారసరళి గమనించిన తరువాత సోనియాసహా కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో కూడా "విదూషకులు'' తలెత్తారు. జాతి విభజన ప్రతిపాదనకు ముందు కాంగ్రెస్ అధిష్ఠానంలోని కేంద్రమంత్రి మండలిలోని తెలుగేతర శక్తులు చేసిన పని తెలుగుకు ప్రాచీన (శిష్ట) భాషా ప్రతిపత్తి దక్కకుండా కుట్రపన్నటం! ఈ బాపతులో ముఖ్యమైన చొరవచూపిన వాళ్ళు - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలోని డి.ఎం.కె.ముఠా భారతీయ భాషల్లో అత్యంత శక్తిమంతమైన ద్రావిడభాషా కుటుంబంలో అజంత భాషగానూ, యావత్తు ప్రాచ్యఖండపు భాషలలోనే "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'' (ప్రాచ్యాఖండపు ఇటలీభాష)గానూ నికోలమ్ కోంటీ కీర్తించిన తెలుగుభాషను తొక్కిపెట్టడానికి ప్రయత్నించడమేగాక, ప్రాచీన చరిత్రగల సంస్కృత భాషను కూడా పక్కనపెట్టి ముందుగా తమిళభాషకు శిష్ట భాష ప్రతిపత్తిని అధికారికంగా కుట్రద్వారా ప్రకటింపజేసుకున్నవారు కొందరు తమిళ మంత్రులు! ఆ తరువాతనే సంస్కృతానికి, తెలుగు, కన్నడ భాషలకు కూడా ప్రజాద్యోమాల ద్వారానే కేంద్రం శిష్టభాషా ప్రతిపత్తిని ప్రకటించకతప్పలేదు! ద్రావిడ భాషా కుటుంబంలో స్వతంత్రప్రతిపత్తితో మొట్టమొదటిసారిగా విడివడి తన తనాన్ని ఘనంగా చాటుకున్న భాష తెలుగేనని మరచిపోరాదు!

          అలా కేంద్రమంత్రి వర్గంలోని 'తమిళలాబీ'వర్గం ముందు తెలుగుభాషకు చిచ్చుపెట్టడానికి కాల్డువ్వి విఫలమైన తరువాత తెలుగుజాతిని చీల్చడానికి కూడా సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నిరుద్యోగులైన 'గుప్పిడు' నాయకుల స్వార్థప్రయోజనాలను పసికట్టిన తమిళపెద్దలు ఆ నాయకుల పదవీలాలసను వాడుకున్నారు; దాని ఫలితంగా కేంద్రంలో తమిళమంత్రి చిదంబరం నోటినుంచి వెలువడిందే - తెలంగాణా విభజనకు ''ప్రక్రియ (ప్రోసెస్) మొదలవుతుందన్న ప్రకటన! ఇక అక్కడినుంచి ఇటీవల దాకా ఆ ప్రక్రియను ఎలా ప్రారంభించి, ఎలా ముగించాలో పాలుపోక కుడితిలో పడిన ఎలుక మాదిరిగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వమూ, రాష్ట్రంలోని నేను పైన ప్రస్తావించిన ఆ ముగ్గురు 'విదూషక' రాజకీయవేత్తలూ తన్నుకు చావవలసి వచ్చింది! సరిగ్గా ఈ సమయంలోనే తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి ఒక ప్రకటనలో "తమిళనాడు రాష్ట్రంనుంచి మదురై రాజధానిగా దక్షిణ తమిళనాడు విడిపోవాలని సాగుతున్న వేర్పాటువాద ఉద్యమాన్ని గమనించకుండా ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన ప్రక్రియను ఎలా చేపట్టావ''ని చిదంబరాన్ని వాయించ వలసివచ్చిందని మరచిపోరాదు.

              అది మొదలు - ఈ రోజువరకూ పొత్తు, పొంతనా లేని ప్రకటనలతో, పరస్పరం విరుద్ధమైన వ్యాఖ్యాలతో మంత్రులూ, కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని దిగ్విజయ్ సింగ్, షిండే, చాకో, వీరప్పమొయిలీ, గులామ్ నబీ ఆజాద్, సందీప్ దీక్షిత్ పోటాపోటీలతో తెలుగుజాతి విభజన ప్రతిపాదనపైనే కేంద్రీకరిస్తూ వచ్చారు! భాషాప్రయుక్త ప్రాతిపదికపైన అందులోనూ దశాబ్దాలపాటు కాంగ్రెస్ తీర్మానాలకు అనుకూలంగానూ, అదే కాంగెస్ తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగుజాతికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అదే కాంగ్రెస్ చేజేతులా స్వార్థప్రయోజనాల కోసం చీల్చాలని తపన పడుతోంది. అందుకు దారి కనపడకనే పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రజల్ని గందరగోళ పరుస్తూ 'మానవద్వేషు'లు (శాడిస్టుల)లాగా వీరు తెలుగుజాతిని వారి మధ్య నెలకొన్న భవబంధాలనూ బలవంతంగా తెగ్గొట్టడానికి స్థానిక 'విదూషకు'లను తోలుబొమ్మలుగా కాంగ్రెస్ అధిష్ఠానం వాడుకొంటోంది. 'గురివింద గింజ' తన కింది 'నలుపు'ను ఎరుగనట్టే మహారాష్ట్రలో 'విదర్భ'ప్రాంతం, కర్ణాటకలోని 'కూర్గు', బెంగాల్ లోని 'గూర్ఖాలాండ్', తమిళనాడులోని దక్షిణ తమిళనాడులాంటి ప్రాంతాలు కోరుతున్న వేర్పాటువాదులను ఉద్యమాలను పట్టించుకోకుండా 42 మంది ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల అండతో ఇంతకాలం ధైర్యంగా నిలబడుతూ వచ్చిన కాంగ్రెస్ కేంద్రప్రభుత్వం అకస్మాత్తుగా ఒక్క తెలుగుజాతి ఐకమత్యాన్నే ధ్వంసం చేయడానికి కారణం - రాష్ట్రంలోని గుప్పిడు విద్రోహుల ఉద్యమంతో పాటు ఎన్నికల అనంతరం కేంద్రంలో రకరకాల పదవులకోసం అర్రులుచాస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకుల తపన తప్ప మరొకటి కాదు.

          షిండే విదర్భ గురించి మాట్లాడడు, మొయిలీ కూర్గును గురించి ప్రస్తావించడు, గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి గురించి కేంద్రంలోని బెంగాల్ మంత్రులూ మాట్లాడరు. కాని వీరందరికీ ఆంధ్రప్రదేశ్ అన్నా, తెలుగుజాతి అన్నా కన్నెర్ర చేయడానికి సాహసిస్తారు. ఈ దుస్సాహసాన్ని తెలుగుజాతి తిప్పికొట్టడానికి సిద్ధమవుతారు. స్థానిక "బుడ్దర్ ఖాన్''ల, జాతి విద్రోహుల భరతాన్ని ప్రజలు పడతారు! ఆరునెలల స్నేహంలో "వారు వీరు, వీరు వారు అవుతార''న్న  సామెతకు తోడుగానే సుమారు 150 సంవత్సరాలపాటు దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలన ఫలితంగా వారి "విభజించి - పాలించే'' విధానాన్ని నేటి కాంగ్రెస్ నాయకత్వం అప్పనంగా "దత్త స్వీకార పధ్ధతి'' నమూనాలోనే అందిపుచ్చుకున్నది! అందుకు రాజ్యాంగంలో, స్వదేశ సంస్థానాలు భారత యూనియన్ లో చేరడానికి 'ససేమిరా' అంటూ, ఎవడికివాడు సొంత "రాజ్యాలు'' కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్న ఘడియలలో ఆ పరిణామాన్ని నివారించడం కోసం రాజ్యంగా నిర్ణేతలు అధికరణ (3)ను ప్రవేశపెట్టవలసి వచ్చింది; సరిగ్గా ఆ సమయంలోనే ముసాయిదా రాజ్యాంగానికి తుదిమెరుగులు దిద్దుతూ, ఉత్తరాత్టరా తమ "రాజ్యాల''లో [స్వదేశ సంస్థానాలు] స్వతంత్ర భారత పార్లమెంటును కాదని మొరాయించే పక్షంలో ఆ సంస్థానాలను విడగొట్టి వాటి అసహజమైన సరిహద్దుల్ని చెరిపి, ఆ సంస్థానాలను మరొక దానితో విలీనం చేసే స్వేచ్చను పార్లమెంటుకు దఖలు ఏర్పర్చడమే ఆ అధికరణ లక్ష్యం!

               కాని ఆ అధికరణ చాటున దాగి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని - అదే అధికరణను తన "సీట్ల''ను కాపాడుకోవడం కోసం, తన అధికారాన్ని ఎలాగోలా నిలుపుకోడం కోసం, ప్రత్యర్థుల విజయావకాశాలను దెబ్బతీయడం, పచ్చిస్వార్థంతో ప్రజలను చీల్చడం కోసం ఆ అధికరణ (3)ను ఉపయోగించడానికి అలవాటుపడింది. అంతేగాని, రాష్ట్రాల ప్రజల ప్రయోజనం కాదు. ప్రజల ప్రయోజనమే తన పరమావధి అనుకుంటే, రాజ్యాంగం అయిదవ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ, గిరిజన తెగల ప్రయోజనాలను కాపాడడం కోసం వలస చట్టాల్ని చించివేసి వారికి స్వపరిపాలనా ఏర్పాట్లు చేయాలి. కాని ఆ పని 65 సంవత్సరాల తర్వాత కూడా జరగలేదు. అందుకే గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి కల్పించాలన్న డిమాండూ ముందుకు రావలసి వచ్చిందని గ్రహించాలి!

Thursday, November 7, 2013

సుప్రీంలో సమైక్యవాదుల అలజడి!

             రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపడానికి అనేక మంది చట్టం, న్యాయాల సాయాన్ని తీసుకొంటున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాట చెల్లుబాటు కాకుండా చూడటానికి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమలు కాకుండా చూడటానికి అనేక మంది సుప్రీం కోర్టు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకూ సుప్రీంలో ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా లెక్కకు మించి పిటిషన్లు పడినట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, ముఖ్య రాజ్యాంగ నిపుణులు వేసే పిటిషన్లకు మాత్రమే పత్రికల్లో కవరేజీ వస్తోంది. అయితే సామాన్యులు, ఇతరులు వేసే పిటిషన్లు కూడా చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ పిటిషనర్ల ఆశ అంతా.. రాజ్యాంగం మీదే! ఆంధ్ర్రపదేశ్ ఏర్పాటు సమయంలో రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ ను అడ్డుపెట్టుకొని విభజన నను ఆపాలని వీరంతా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర్ర ప్రదశ్ విభజనకు బిల్లు రూపొందిస్తే.. దాన్ని పార్లమెంటు వరకూ తీసుకు వస్తే రాజ్యాంగం ప్రకారం ఆ బిల్లు చెల్లదని కో ర్టు ద్వారా చెప్పించాలని పిటిషనర్లు తాపత్రయపడుతున్నారు. బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అని స్పష్టం చేయించాలని భావిస్తున్నారు. అలా రాష్ట్ర విభజన ప్రక్రియ వచ్చే శీతాకాల సమావేశాల సమయంలో ఆగిపోతే.. 2014 తర్వాత ముందడుగు పడే అవకాశాలే లేవని భావిస్తున్నారు. అయితే ఇదంతా ఆశాభావ దక్పథం మాత్రమే. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా మాయ చేసి బిల్లును ముందుకు తీసుకెళ్లి.. విభజన ప్రక్రియను పూర్తి చేస్తే ఆ తర్వాత ఎవరు చేయగలిగింది ఏమీ ఉండదు. ప్రస్తుతానికి అయితే సుప్రీం స్థాయిలో సమైక్యవాదుల హడావుడి ఎక్కువగా ఉంది. మరి వారు ఈ విషయంలో గెలుస్తారో, గల్లంతవుతారో వేచి చూడాలి!

Wednesday, November 6, 2013

జీవోయం వద్దు - ఆంద్ర ప్రదేశ్ ఎస్సార్సీ వెయ్యండి

       రాష్ట్రాన్ని ముక్కలు చేసెయ్యడానికి ఉరుకులూ పరుగులూ పెడుతున్న కేంద్ర ప్రభుత్వం - అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు; ఇంకా మాట్లాడితే - అసెంబ్లీని సస్పెండ్ చేసి అయినా, బిల్లు తెచ్చేస్తాం అన్న సర్కారు వారు - హఠాత్తుగా "అఖిలపక్షం" పాట ఎందుకెత్తుకున్నారు? మేము చెప్పిందే ప్రజాస్వామ్యం అన్న వాళ్ళకి - మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు గుర్తుకు వచ్చాయి? వచ్చెనే పో! అన్ని పార్టీలతో మాట్లాడి, అందరూ ప్రేమ లేఖలు ఇచ్చిన తర్వాతే, బిల్లుకు సై అన్నామని డోలుకొట్టి మరీ చెప్పిన వాళ్ళు ... మళ్ళీ విపక్షాలతో మంత్రాంగానికి తలుపులెందుకు తెరిచారు?

దారి తప్పిన వైనం:

అఖిల పక్షాల నిర్వహణ ప్రకటనలో ఒక గందర గోళం ఉంది. అఖిల పక్ష సమావేశం నిజానికి - CWC నిర్ణయానికి ముందే నిర్వహించాలి. cwc నిర్ణయం తర్వాత > కేబినేట్ నోట్ పెట్టిన తర్వాత, జీవోయం నియామకం తర్వాతః - తెలంగాణా ఇచ్చేస్తున్నామని కేంద్రం ప్రకటించిన తర్వాత - తీరికగా - అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చెయ్యడ మేమిటి? దానికి ముందే - జీవోయం రిఫరెన్సులపై రాత పూర్వకంగా అభిప్రాయం చెప్పాలని ఆదేశాలేమిటి? ప్రజల అభిప్రాయంతో కాక, అధినేత్రి నిర్ణయంతో తెలంగాణా ఇచ్చేస్తున్నామని ప్రకటించారు కదా!.ఇంతవరకు బిల్లుకు ఓ రూపం ఇవ్వ లేదు - రాష్ట్రపతికి పంప లేదు! అసెంబ్లీకి రాలేదు - పార్లమెంటుకు వెళ్ల లేదు - రాష్ట్రం ముక్కలు చెయ్యడానికి మాత్రం ఏర్పాట్లు మొదలెట్టేసారు! ఈ తతంగం బాగోలేదని రాష్ట్రపతి చివాట్లు వెయ్యడంతోనే ఈ అఖిల పక్ష నాటకానికి తెర లేచినట్లుంది. అయితే, ఇది మరింత గందరగోళానికే దారి తీస్తుంది!

ఏం చేసి ఉండాలి?

ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం "రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు" పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. అందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాల సేకరణ చేసి - దానికి అనుగుణంగా - బిల్లు ఏర్పరచాలి. అదే సరైన ప్రాతిపదిక అవుతుంది. ఇక్కడ కేంద్రం ప్రజలను బైపాస్ చేసేసింది. పార్టీలు గతంలో ఇచ్చిన ప్రేమ లేఖలనే తెలంగాణా ఏర్పాటుకు ప్రాతిపదిక అంది. పార్టీల అభిప్రాయాలు సేకరించి - ఆ ప్రకారం బిల్లు పెట్టాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఒక పక్క -రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ ఐన అసెంబ్లీ అభిప్రాయమే అవసరమే లేదని, దానిని లెక్కజేయవలసిన అవసరమే లేదని గీరగా మాట్లాడుతున్నవాళ్ళు - ఇప్పుడు అఖిల పక్షం కోసం ఎందుకు హడావిడీ చేస్తున్నారు? అసెంబ్లీకన్నా అఖిల పక్షం ఎట్లా ఎక్కువ?

ఆంటోనీ కమిటీ వేసినప్పుడు - అది కాంగ్రెస్ పార్టీ కమిటీ అని విమర్శించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు ప్రభుత్వ కమిటీ (జీవోయం) వేస్తే - దాని ఎదుట తమ అభిప్రాయాలు ఎందుకు చెప్పరని - కేంద్ర కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది? జీవోయం ప్రతిపాదనలను అంగీకరించినా, తిరస్కరించినా - రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. అధినేత్రి నిర్ణయానికి అఖిల పక్ష ముద్ర వేయించుకోడానికే ఈ తతంగమంతా! జీవోయం "విభజన తర్వాత" ఏమి చెయ్యాలో చెప్పమనే అడుగుతోంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రతిపక్షాలు, చివరకు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలు కూడా ఈ అఖిలపక్ష సమావేశాల ఏర్పాటును తప్పుబట్టాయి.దీనితో మొత్తం వ్యవహారం గందరగోళంలో పడిపోయింది.

జీవోయం ను బహిష్కరించక తప్పదు!

సమైక్య వాదులు కానీ, సమన్యాయ వాదులు కానీ కోరుతోంది - రాష్ట్ర విభజన అవసరమా కాదా అన్నఅంశం పై ప్రజాభిప్రాయం కోరాలని! అందుకోసమే - వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ విద్యార్థీ సంఘాలు, రైతులను ఈ నిర్ణయంలో భాగాస్తులను చెయ్యాలని కోరుతున్నారు. "విభజనకు తీర్పు ఇచ్చేశాం. మీ బాధలు, వాదనలు మాత్రమే చెప్పుకోండి" అంటోంది కేంద్రం! ఇదొక వెటకారం! కాదంటే, కుటిల వ్యవహారం! "తెలంగాణా ఇచ్చేసాం; సంతకాలు పెట్టి వెళ్ళండి" అని అనడమే ఇది! కాంగ్రెస్ విసిరిన ఈ అఖిల పక్ష సవాలును అవకాశంగా తీసుకొని - విపక్షాలు జీవోయం రద్దు కోరాలి! లేదా బహిష్కరించాలి!

జీవోయం వద్దు - ఆంద్ర ప్రదేశ్ ఎస్సార్సీ వెయ్యండి:

రాష్ట్రాల విభజనకు, రీడిజైన్ చేయడానికి నేపథ్యంగా అందుకో బలమైన ప్రాతిపదిక ఉండాలి. అది జనాభిప్రాయానికి దగ్గరగా ఉండాలి. వివిధ సెక్షన్ల ప్రజలను, ప్రజా సంఘాలను ఇందులో భాగస్తులను చెయ్యాలి. విభజన వాదుల ఒత్తిడి రాజకీయం, విద్వేష ప్రచారం, జనాన్ని రెచ్చగొట్టి సృష్టించిన హింసాత్మక వాతావరణం - ఇవే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదిక అయితే, భవిష్యత్తులో అట్లాంటి విప్లవాలు దేశమంతా తలెత్తడం ఖాయం!

పునర్వ్యవస్థీకరణకు - రెండవ ఎస్సార్సీనే ఉత్తమ మార్గం అని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఒకవేళ దేశ వ్యాపితంగా అట్లాంటి వ్యవస్థ చెయ్య లేకపోతే, ఆంద్ర ప్రదేశ్ లో 'అత్యవసర పరిస్థితి' ఉందని అనుకుంటే, అందుకోసం ఏర్పాటు చేసే వ్యవస్థ ' ఎస్సార్సీ కన్నా తక్కువ స్థాయిది' కాకూడదు! అది అధినేత్రి ఇష్టారాజ్యం అసలే కాకూడదు! ఇప్పటికైనా మించి పోయిందేముంది? అఖిల పక్షం జిమ్మిక్కులు మాని - జీవోయం ఎత్తేసి - Special Committee for Re-organization of AP (SCRAP) వెయ్యాలి! అది ప్రజాభిప్రాయ వేదిక కావాలి! దీనికి విరుద్దంగా ఏమి చేసినా అది అధికార పార్టీ దురహంకార పూరిత ఏకపక్ష నిర్వాకమే అవుతుంది.

Sunday, November 3, 2013

ఏంచెప్తాం?: బొత్స బాణంపై జగన్ నో, బాబు డైలమా

              ఈ నెల 5వ తేదీలోపు మంత్రుల బృందం(జివోఎం) విధివిధానాల పైన నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత అఖిల పక్షం ఉంటుందన్న కేంద్ర హోంమంత్రి లేఖల పైన రాష్ట్రంలోని పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అఖిల పక్షానికి వెళ్లడం వృథా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తుంటే, అనవసరమైన వెళ్తామని తెరాస భావిస్తోంది. బిజెపి వంటి పార్టీలు దీనిని స్వాగతిస్తున్నాయి. మరోసారి అఖిల పక్షం ఏర్పాటు చేయాలని పిసిసి చీఫ్ బొత్స అధిష్టానానికి లేఖ రాశారు. ఆయన వదిలిన బాణం టిడిపి వంటి పార్టీలను ఇరకాటంలో పడేసింది. అదే సమయంలో బాబు కూడా అఖిల పక్షానికి డిమాండ్ చేశారు. అయితే ఆయా పార్టీలు జివోఎంకు చెప్పాల్సిన దాని పైన, అఖిల పక్షంలో ఏం చెప్పాలనే దాని పైన నివేదికలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఏం చెబుతామనే చర్చ పార్టీలలో జోరుగా సాగుతోంది. ప్రాంతాల వారీగా సూచనలు, సలహాలు తీసుకొని.. రెండింటిని కలిపి ఒకే నివేదికగా పొందుపర్చి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పంపించే అవకాశముంది. సీమాంధ్ర నేతల్లో ఎక్కువ మంది విభజన తప్పని స్థితిలో మంచి ప్యాకేజీ కోరాని డిమాండ్ చేస్తున్నారు. 

        కేంద్ర హోంశాఖ లేఖ పైన టిడిపిలో తీవ్ర తర్జన భర్జన సాగుతోంది. ఒకటి రెండు రోజుల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. అయితే అఖిల పక్షానికి టిడిపి గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి. జివోఎంకు పంపే నివేదిక పైన చర్చించనున్నారు. అఖిల పక్షాన్ని బిజెపి స్వాగతిస్తోంది. తెలంగాణను కోరుతూనే సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ బిజెపి నివేదికలో కోరే అవకాశముంది. విభజన నిర్ణయం జరిగిన నేపథ్యంలో అఖిల పక్షానికి వెళ్లవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అఖిల పక్ష సమావేశం అనవసరమని తెరాస భావిస్తోంది. అయితే ఈ సమావేశం విభజన తర్వాత వచ్చే సమస్యల పైన కావడంతో తెలంగాణ ప్రాంతానికి ఏమేం కావాలో తెరాస డిమాండ్ చేయనుంది. ఇందుకోసం జివోఎంకు ఓ నివేదిక పంపనుంది. అఖిల పక్షం ఏర్పాటు చేస్తే పార్టీ అధినేత కెసిఆర్ స్వయంగా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇక సమైక్యవాదం వినిపిస్తున్న సిపిఎం, విభజన అంటున్న సిపిఐ వంటి పార్టీలు ఎవరి వాదన వారు వినిపిస్తూ రెండో ప్రాంతానికి న్యాయం చేయాలని కోరే అవకాశముంది.

అసెంబ్లీకి బిల్లు వస్తే ... ఢిల్లీ సుల్తానుల కళ్ళే తెరిపించేలా చారిత్రక పోరాటం జరగాలి!


కేంద్రం - రాష్ట్ర విచ్చిన్నానికి అన్ని సన్నాహాలు చేస్తోంది; అనేక రకాల ఆటంకాలు వచ్చే అవకాశం కనబడుతున్నా, కేంద్రం రాష్ట్ర విభజనకు మొండిగా ముందుకు పోవడానికి కారణం - సీమకు, కోస్తాకు చెందిన మంత్రుల లొంగుబాటే. కేబినెట్లో ఉన్న ముగ్గురు మంత్రులు ... మరోసారి ద్రోహం చెయ్యడానికి - ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. .ముసాయదా బిల్లుపై సంతకాలు పెట్టి ... మరోసారి వంచన చెయ్యబోతున్నారు! (కేబినేట్ సమావేశాలు బహిష్కరించాలని కావూరి, పల్లం రాజు, కిషోర్ చంద్ర దేవులపై ఒత్తిడి తేవాలి!

ఇప్పుడు మనముందు ఉన్న అవకాశాలు:


1. ఢిల్లీలో ప్రదర్శనల ద్వారా ఒత్తిడి తీసుకు రావడం;
2. వివిధ జాతీయ, ప్రాంతీయ పక్షాలకు వాస్తవాలు తెలియజేసి పార్లమెంటులో వ్యతిరేక వాతావరణం సృష్టించడం;
3. సమస్యను సరైన కోణంలో జాతీయ మీడియా దృష్టికి తీసుకు వెళ్ళడం;
4. రాష్ట్రపతి ధర్మబద్ధంగా వ్యవహరించేలా ప్రయత్నించడం;
5. కేబినేట్ సమావేశాలు బహిష్కరించేలా మన మంత్రులపై ఒత్తిడి తేవడం;
6. అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు - మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా వోటు వేసేలా చూడటం;
7. అసెంబ్లీలో విభజన వాదాన్ని వాస్తవాల ఆధారంగా ఎండగట్టడం;
8. అసెంబ్లీలో అభిప్రాయాలను క్రోడీకరించి - సభ ఆభిప్రాయాన్ని - రాష్ట్రపతి ముందుపెట్టడం;
9. బిల్లు పార్లమెంటులో పెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తే - ఉద్యోగులు మెరుపు సమ్మె చెయ్యాలి. జనజీవనం స్తంభించాలి.
10. ఈ లోపు బిల్లుకు వ్యతిరేకంగా - న్యాయస్థానాలలో - వివిధ కోణాలలో పోరాటం ప్రారంభం కావాలి;
11. చివరిగా పార్లమెంటు సమావేశాలలో ప్రభుత్వం పడిపొయ్యేలా రాజకీయ ఒత్తిడి తీసుకు రావడం;

సమైక్య ఉద్యమం విద్వేషం ఆధారంగా ముందుకు పోలేదు; తీవ్రవాదంతో నేర పూరితమైన ఒత్తిడి తీసుకు రాలేము; తీవ్రవాదమే విభజనకు కొమ్ము కాచిన తరుణం ఇది; ఈ పరిస్థితులలో, రాజ్యాంగ ప్రక్రియను కాలరాచి, నిరంకుశ పూరితంగా రాష్ట్ర విభజనకు కేంద్ర తెగిస్తోంది. ఈ నేపథ్యంలో - రాజ్యంగ పరమైన అంశాలను ముందుకు తెచ్చి విభజనను అడ్డుకోవడం - పూర్తిగా న్యాయ సమ్మతమే. ఇది కేవలం - సాంకేతికమైన అంశమే - అని కొందరు మేధావులు తీసిపారేయవచ్చు గాక!

కానీ, ధర్మ సూక్ష్మం - సూక్ష్మంగానే ఉంటుంది; కీలక సమయంలో అదే పరమ ఆధారం అవుతుంది; మహాశక్తిమంతం అవుతుంది. సూదిమోపినంత స్థలం ఇచ్చినా - పాండవులు - తిరిగి ధర్మ రాజ్యం స్థాపించగలరని భావించబట్టే, దుర్యోధనుడు అందుకు ససేమిరా అన్నాడు. 371-డి అట్లాంటి 'సూదిమొన' వంటి అంశమే కావచ్చు - కానీ దాని మహాత్మ్యం, గొప్పతనం - దేశకాలమాన పరిస్థితులనుబట్టి రూపొందుతుంది. రాజకీయం ప్రజాస్వామిక మర్యాదలను అతిక్రమించినప్పుడు ...ప్రజలు న్యాయపీఠాన్ని ఆశ్రయించక తప్పదు. పాలకులు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నప్పుడు - అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోక తప్పదు.

అసెంబ్లీ అభిప్రాయం మహత్తరం:

శాసన సభ, విధాన సభ - రెండూ కూడా రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన సంస్థలు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన సంస్థలు. ఈ రాష్ట్రానికి సంబంధించి - అసెంబ్లీలకు బయట పార్టీల అభిప్రాయాలకు కట్టుబాటు విలువ లేదు! అసెంబ్లీ లోపల చెప్పే మాటలకే అట్లాంటి విలువ ఉంటుంది. లేఖల ఆధారంగా రాష్ట్ర విభజన చేస్తున్నామని చెబుతున్న కేంద్రం - రాజ్యాంగ బద్ధ సంస్థ ఉమ్మడి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు; సభ తిరస్కరించినా బిల్లుకు ఆమోదం తెలుపుతానని రాష్ట్రపతి చెప్ప కూడదు! నిజానికి రాష్ట్రపతి బిల్లును శాసన సభకు పంపనే కూడదు! సరైన ప్రాతిపదిక లేని రాష్ట్ర విభజన మంచిది కాదని బిల్లును తిప్పి పంపాలి.

ఒకవేళ బిల్లు పంపినా - అస్మ్బ్లీ అభిప్రాయానికి రాష్ట్రపతి తప్పనిసరిగా విలువ ఇచ్చి తీరాలి. ఎందుకంటే - అసెంబ్;ఈ తీర్మానం ఒకవిధంగా - ఏర్పడబోయే ఒక రాష్ట్రం యావత్తు ఒకే తాటిపై నిలబడి - తమని ప్రత్యేక రాష్ట్రంగా విడదీయవద్దని - నిర్ణయించి చెప్పడమే అది!

ఇంతవరకు భారత దేశ చరిత్రలో ఇట్లాంటి సన్నివేశం రాలేదు! కోరుకున్న వాళ్లకు రాష్ట్రాలు ఇవ్వని పరిస్థితి ఉంది కానీ, వద్దన్న వాళ్ళను బలవంతంగా చీల్చి, తన్ని తరిమి వేసే సందర్భం రాలేదు! ప్రపంచంలోనే వచ్చి ఉండదు! సొంత రాష్ట్రం కావాలని ఉద్యమాలు ఉండవచ్చు కానీ, ఇతరులను పంపించి వెయ్యండి అనే ఉద్యమాలు ఎక్కడా ఉండవు! ఇది EXPULSION - తరిమివేత మాత్రమే! ఘోరమైన అవమానం మాత్రమే! సమాఖ్య వ్యవస్థకు ప్రాధాన్యం ఉన్న భారత దేశంలో - ఒక రాష్ట్రాన్ని - వెలివేసినట్లుగా ఏర్పరుస్తారా? నేరస్తులు, దోషులు అన్న ముద్రతో ఈ ప్రజానీకాన్ని విభజించి దూరంగా నేరస్తులు, దోషులు అన్న ముద్రతో ఈ ప్రజానీకాన్ని విభజించి దూరంగా విసిరేస్తారా? ఇది జాతీయ సమగ్రతకు చాలా చేటుగా పరిణమిస్తుంది. ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వం ఆపాలి! అది తెగించినా రాష్ట్రపతి విజ్ఞత చూపాలి!

రాష్ట్ర విచ్చిత్తి ఒక సమస్యకు అంతం కాదు ఆరంభం మాత్రమే! రాష్ట్ర విభజన గర్భంలో - దేశంలో ఎక్కడా ఎరుగని ఆరాచక పరిస్థితులు ఏర్పడి - జనం పెద్ద ఎత్తున వలసలు పోవలసిన దాగి ఉంది. Mass Genesode అనివార్యం అవుతుంది.. ఇన్నాళ్ళూ పెంచిపోషించిన విద్వేషం, విష ప్రచారం దారుణమైన సంఘ వ్యతిరేక కార్యకలాపాలుగా రూపుదాల్చే ప్రమాదం ఉంది. కొన్ని తరాలపాటుగా కోట్లాది జనం - తమ జీవితాలలో సంక్షోభం ఎదుర్కోవలసి వస్తుంది. జిల్లాల మధ్య నదీ జలాల వివాదాలు పెచ్చరిల్లడం ఖాయం! ఇన్ని అమానుష పరిణామాలకు దారి తీసే ఈ విభజన ఒక రాజకీయ అత్యాచార పర్వం తప్ప వేరొకటి కాదు!

అసెంబ్లీకి బిల్లే కనుక వస్తే - ( వచ్చే అవకాశాలు చాలా తక్కువే ) - సభ లోపల, బయట కూడా ప్రజాగ్రహం వెల్లువెత్తాలి. ఢిల్లీ సుల్తానుల కళ్ళే తెరిపించేలా చారిత్రక పోరాటం జరగాలి! అందుకు ఇప్పటినుంచే మానసికంగా సంసిద్దులమవుదాం!

Saturday, November 2, 2013

మీ అంతర్నాటకాలు మీరు చూసుకోండి! సమైక్య ఉద్యమాన్ని వెన్నుపోటు పొడవకండి!


మీ అంతర్నాటకాలు మీరు చూసుకోండి! సమైక్య ఉద్యమాన్ని వెన్నుపోటు పొడవకండి!

బీజేపీ సీమాంధ్ర దళాలు మళ్ళీ ఢిల్లీకి దవుడు తీశాయి. రాష్ట్ర విభజన జరిగితేసీమాంధ్రకు నష్టం జరగనీయ రాదని జాతీయ అధ్యక్షుణ్ణి కోరాయి. జీవోయం కు సీమాంధ్ర నివేదిక వేరుగా ఇస్తున్నాయి. పేరుగొప్ప పార్టీ 'రాష్ట్రం మొత్తానికి ఒకే నివేదికసమర్పించ లేకపోయింది. పార్టీలో తెలంగాణా పెత్తనం గుత్తాధిపత్యంగా నడుస్తోందని సీమాంధ్ర బీజేపీ నేతలు భావించవచ్చు! అయితేఅది వాళ్ళ అంతర్గత సమస్య. 
రాష్ట్ర విభజన గురించి బీజేపీ వైఖరి ఏమిటి అన్నదే మన ముందు ఉన్న ప్రశ్న! ఢిల్లీకి పోయి ప్రత్యేక నివేదిక ఇచ్చినంత మాత్రాన సీమ - తీర ప్రాంత ప్రజానీకానికి వీళ్ళు చేసే  గొప్ప మేలేమీ లేదు! పైగా పనికిమాలిన జీవోయంను గుర్తించిగౌరవించి - తగుదునమ్మా అని సీమాంధ్ర ప్రజల తరఫున దానికో నివేదిక ఇవ్వడమే తప్పు! నిజానికి "జీవోయం అంటే - విభజన మంత్రుల బృందం!!". కానీబీజేపీ దళాలు ఇప్పుడు ఒక స్పష్టమైన ప్రకటన చెయ్యాలి - తాము కోరిన అంశాలు బిల్లులో లేకపోతేవిభజనకు సమర్ధన వాపసు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తేవాలి!
 
ఈ కింది ప్రశ్నలకు సీమాంధ్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి:
1. కేంద్రం ప్రజాస్వామిక పద్ధతులలోనే రాష్ట్ర విభజన వ్యవహారం నడిపిస్తోందా?
2. రాష్ట్ర విభజన ఖచ్చితంగా రాజ్యాంగ ప్రక్రియ అనుసరించే జరుగుతోందా
3. కేంద్ర కేబినేట్ 'విభజనకోసం ప్రతిపాదనచేయడం ఏకపక్ష నిర్ణయం కాదా
4. రాష్ట్ర విభజనకు పార్లమెంట్ ఆమోదించకముందే విభజన జరిగిపోయినట్లుగా ప్రభుత్వం ఆ దిశలో నిర్వహణా చర్యలు చేపట్టవచ్చా?
5. విభజనకు ముందేఆర్టికల్ 371-డి లో మార్పులు-చేర్పులు లేదా రద్దు అవసరమైతేబీజేపీ రాజ్యాంగ సవరణకు బేషరతు మద్దతు ఇస్తుందా
6. అప్పుడు ఆర్టికల్ 371-డి ఇచ్చిన హామీలుగ్యారంటీలు కొనసాగుతాయాకుదించబడతాయా? 371-డి రాష్ట్ర సమగ్రత రక్షణకు ఇచ్చిన హామీ అని బీజేపీ నేతలకు తెలుసా?
7. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రపతికి ప్రతిపాదన చేయవలసినది రాష్ట్ర అసెంబ్లీనాకేంద్ర ప్రభుత్వమా?
8. విభజన బిల్లు పై అసెంబ్లీ నిరసన తెలిపితేదానికి విలువ ఉండాలాఅక్కర లేదా?
పైన పేర్కొన్నవన్నీ - ప్రజాస్వామిక విలువలకురాజ్యాంగ ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలు. ప్రజాస్వామ్య రక్షణకు చాంపియన్ తానే అని చెప్పుకునే బీజేపీ రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా అప్రజాస్వామికంగాఏక పక్ష సౌజన్యంతోనిరంకుశ ధోరణిలో కొనసాగుతున్నప్పుడు - దానికి గుడ్డిగా బేషరతు మద్దతు ప్రకటించడం న్యాయమేనాఅది సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చెయ్యడంసమైక్య వాదులను మోసం చెయ్యడంతో పాటు బీజేపీకే ప్రవచిత విలువలకే వ్యతిరేకం కాదావిభజన వాదులు రాష్ట్ర విభజన కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంటేసీమాంధ్ర ప్రజలంతా ద్రోహులని విషం కక్కుతూంటేఅదే జేఎసీలలో బీజీపీ కూడా చేరి తందానా అంటుంటేమీరంతా ఏం జేశారుసుషమా స్వరాజ్ హైదరాబాద్ వచ్చి దశాబ్దాల సీమాంధ్రుల  పీడననుండి తెలంగాణాకు స్వాతంత్ర్యం లభించిందని ఉపన్యాసాలిస్తుంటేప్రాంతీయ శతృత్వ భావాలను రెచ్చగొడుతుంటేమీరెందుకు ఖండించ లేదుచెవుల్లో సీసం పోసుకున్నారా?
మీకు చేతనైతేతప్పుని తప్పని మోమాటమి లేకుండానిజాయితీగా చెప్పండి! ఆ ధైర్యం మీకు లేకపోతేరాజకీయాలలోనుంచి తప్పుకొని మౌనంగా కాలక్షేపం చెయ్యండి. అంతేగానీశల్య సారధ్యం చెయ్యవద్దు! ప్రజల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతూ దేశానికి తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దు! ప్లీజ్!

Thursday, October 17, 2013

సిఎం చేతులెత్తేసినా సమ్మె విరమణ: తాత్కాలికమే

                హైదరాబాద్‌: సమైక్యాంధ్ర కోసం తాను హామీ ఇవ్వలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినప్పటికీ ఎపి ఎన్జీవోలు, సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెను విరమించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం వారు గురువారం ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎపి ఎన్జీవోల సంఘం, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. చర్చల అనంతరం వారు సమావేశమై తాత్కాలికంగా సమ్మెను విరమించాలని నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి విధులకు హాజరు కావాలని ఎపిఎన్జీవోలు, ఇతర సీమాంధ్ర ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. విధుల్లో చేరుతామని ఉద్యోగులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఉద్యోగులతో చర్చలు ఫలించాయని ఆయన చెప్పారు. సమ్మె విరమణ తాత్కాలికమేనని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదిస్తే వెంటనే మెరుపు సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు.

        తాము సమ్మె విరమిస్తున్నట్లు సీమాంధ్ర గెజిటెడ్, పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎపిఎన్జీవోల నిర్ణయానికి ముందే ప్రకటించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమిస్తున్నట్లు సీమాంధ్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు చెప్పారు. అవసరమని భావిస్తే తిరిగి సమ్మెలో చేరుతామని వారు చెప్పారు. రాష్ట్రం సమైక్యం కోసం చట్ట సభల్లో పోరాడతామని సీఎం చెప్పారని, సీఎం విజ్ఞప్తి మేరకు తాము సమ్మె విరమిస్తున్నట్లు ఉద్యోగ జేఏసీ తెలిపింది. విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసి ఉద్యోగులు ఇప్పటికే సమ్మె విరమించారు. దీంతో గత 66 రోజులుగా సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తెర పడింది. రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని ముఖ్యమంత్రితో చెప్పామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం పరిధిలో ఉన్న విషయాలపై తాను హామీ ఇవ్వలేనని సిఎం చెప్పారని, తాను ముఖ్యమంత్రిగా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పారని, తీర్మానం అసెంబ్లీకి వస్తే దాన్ని ఓడించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని కూడా చెప్పారని ఆయన వివరించారు. 
          విభజున వల్ల ఉద్యోగులకు జరిగే నష్టంపై తాను కేంద్రానికి నివేదిక ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిపారు. ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఆయన అన్నారు. 371డి ఉన్నంతకాలం రాష్ట్రాన్ని విభజించడానికి వీలు లేదని ఆయన అన్నారు. ఉద్యోగులకు రక్షణ కల్పించిన 371డిని తొలగించే హక్కు కేంద్రానికి లేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన అన్నారు. ఉద్యోగులు మళ్లీ సమ్మె చేయాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు. తీర్మానం, అభిప్రాయ సేకరణ రెండూ అసెంబ్లీలో ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన అన్నారు. అసెంబ్లీలో, పార్లమెంటులో విభజనకు ఏదో దశలో అడ్డు పడే అంశాలు చాలా ఉన్నాయని అశోక్ బాబు అన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన చెప్పారు. సమ్మె కాలానికి తాము వేతనం అడగలేదని ఆయన చెప్పారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, రాజకీయంగా మైండ్ గేమ్ జరుగుతోందని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం వరకే సమ్మెను విరమిస్తామని, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మళ్లీ సమ్మెకు దిగుతామని ఆయన చెప్పారు.

నో విలీనం!: సర్వేల ఉత్సాహంతో కాంగ్‌కు కెసిఆర్ ఝలక్!

                అధికార కాంగ్రెసు పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి ఝలక్ ఇచ్చింది. పార్లమెంటులో బిల్లు పెడితే విలీనం అంశాన్ని పరిశీలిస్తామని ఇన్నాళ్లు చెప్పిన తెరాస ఇప్పుడు పరోక్షంగా కాంగ్రెసు పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తమ పార్టీ విలీనం కాదని పేర్కొంది. తెరాస ఈ నిర్ణయం కాంగ్రెసు పార్టీకి ఊహించని షాకే అని చెప్పవచ్చు. గురువారం తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ విలీనం పైన స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి భౌగోళిక తెలంగాణ కోసమే పుట్టలేదని, రాష్ట్ర పునర్మిర్మాణంలోను ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోనే సాధ్యమని ఈ ప్రాంత ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు.
                    
                   పునర్నిర్మాణంపై తాము ఇప్పటికే కొంత కార్యాచరణ ప్రకటించామని, త్వరలో మరికొంత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఎలాంటి త్యాగాలు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెరాస పోరాటం చేసిందని, భవిష్యత్తులోను పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. తెరాస 13 ఎంపీ స్థానాలలో గెలుస్తుందని టైమ్స్ నౌ సి ఓటర్ సర్వే ఇచ్చిన రిపోర్టుతో తమ పార్టీ బాధ్యత మరింత పెరిగిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి సాధిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఎలాంటి రాష్ట్రం కోరుకుంటున్నారో ఆ దిశగా తెరాస పోరాడుతుందన్నారు. తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చట్టాల పైన గౌరవం లేదన్నారు. తెలంగాణ ప్రాంత టిడిపి నేతలు చరిత్రహీనులుగా మిగలవద్దని, ఆ పార్టీ నుండి బయటకు రావాలన్నారు. తాము పదవుల కోసం పాకులాడే వారం కాదన్నారు.

Wednesday, October 16, 2013

అయ్యబాబోయ్.... సీమాంద్ర కాంగ్రెస్ అసలు బాగోతమిదా!

                           అయ్యబాబోయ్... సీమాంద్ర కాంగ్రెస్ అసలు బాగోతమిదా... అంటూ సీమాంద్ర జనం అవాక్కవుతున్నారు. ఇన్నాళ్లు టిడిపి, వైఎస్సార్ సిపి వంటి పార్టీ నేతలతో పాటు కొన్ని జేఏసిలు సైతం సీమాంద్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగానే సోనియాతో ఒప్పందం కుదుర్చుకుని, విభజనకు అంగీకరించిన తర్వాతే రాష్ట్ర విభజన నిర్ణయం వెలుబడిందని గొంతు బొంగురుపోయేలా మొత్తుకున్న సంగతి తెలిసిందే. అయితే వారంతా గిట్టక అలా ఆరోపిస్తున్నారని, సీమాంద్ర కాంగ్రెసోళ్లంతా సమైక్యం కోసం నిజంగా కష్టపడుతున్నా కూడా పెద్దలు ఒప్పుకోవడం లేదేమో అనుకున్నారు.
                                        కాని ఇప్పుడు ఒక్కొక్కరు కేంద్రమంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కూడా బయటకు వచ్చి అసలు బాగోతం బయటపెట్టేసుకుంటుండంతో అయ్యబాబోయ్ వీరి అసలు బాగోతమిదా... అంటూ గుండెలు బాదుకుంటున్నారు సమైక్యవాదులు. తాజాగా విభజన ఆగదు, ఇక సీమాంద్రకు రావాల్సిన ప్యాకేజిపైనే పోరాడాలి అంటూ వారంత కొత్త రాగం అందుకోవడంతో ఏముంది, అంతా అయిపోయింది, ఇక మాకింత కావాలి అని అడుక్కోవడమే మిగిలింది అన్నట్టే కదా.. అని అంటున్నారు పరిశీలకులు కూడా.
                     నిన్నటికి నిన్న కేంద్రమంత్రి పల్లంరాజు విభజన అయిపోయింది అన్నాడు, అయినా సరే చివరివరకు ప్రయత్నిస్తానని, సీమాంద్రులకు దక్కాల్సింది దక్కేలా చూస్తానన్నారు. ఒక రోజు తేడాతో మరో  కేంద్రమంత్రి పురంధరీశ్వరి నోరు తెరచింది. ఆమె ఇదే విషయాన్ని నొక్కి వక్కానించింది, విభజన అయిపోయింది, పంపకాలే మిగిలాయి అన్న రీతిలో మాట్లాడి పంబరేపింది. ఇక రాజీనామాలు చేసామని కొందరంటే, తాము చేసినా విభజన ఆగుతుందా అంటూ ఏకంగా కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వంటి వారే సెలవిస్తున్నారు. ఇంకా వారి పార్టీకే చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి కాంగ్రెస్ ఎవరితో కుమ్ముక్కయిందో బయటపెడతా, ఒక్క సారి నా రాజీనామా ఆమోదించనీయండి అంటున్నారు. ఇలా వారి మాటలన్నీ విన్నాక అందరు దొంగలే, కాని బయట పడకుండా ఉండేందుకు నానా వేశాలు వేస్తున్నారని, అందరికి అన్ని తెలిసే విభజన జరిగింది, ఎవరికి దక్కాల్సినవి వారికి దక్కినట్టే, అందుకే ఎవరెంత మొత్తుకుంటున్నా సరే సోనియా తెలంగాణ ఏర్పాటుకు ముందుకే పోతోందన్న విషయం ఇప్పటికి అర్థమయిపోయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.


కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ సీమ, ఆంధ్రుల మధ్య చిచ్చు..!

                    ఇద్దరు కలిసి కట్టుగా ఉంటే వారిని ఓడించడం,దెబ్బతీయడం అంత సులభం కాదు.. అందుకే ముందుగా వారిని రెండుగా విడదీసి.. తర్వాత ఓడించు..అనేది బ్రిటీషు వాడు చెప్పిన రాజకీయ నీతి. భారతదేశంలో పాగా వేయడానికి బ్రిటిషర్లు  ఈ నీతినే ఫాలో అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఇదే దిక్సూచి అవుతోంది. తమకు రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత పరిస్థితులు కనిపిస్తున్న సీమాంధ్ర ప్రాంతాన్ని.. సమైక్యాంధ్ర అంటూ ఏకతాటిపై నిలబడుతున్న ఆ ప్రాంతాన్ని విడదీయడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ రంగం సిద్ధం చేస్తోంది. 
ఈ విషయంలో వారు 'రాజధాని' అంశాన్ని అస్త్రంగా చేసుకొన్నారు. ఇక విభజనపై వెనక్కు తగ్గమని స్పష్టం చేసిన కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు రాజధాని అనే ఫుట్ బాల్ ను ఇచ్చి తన్నుకొమ్మని సీమాంధ్ర నేతలకు అదేశించే అవకాశాలున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి షిండే వ్యాఖ్యల్నీ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారని విలేకరులు అడిగితే కేంద్ర హోం మంత్రి షిండే సమాదానం చెబుతూ అది ఆ ప్రాంత ప్రజలు, నేతలు నిర్ణయించుకోవాల్సిన విషయమని అన్నారు.
                      ఇది చాలు సీమాంధ్ర నేతల మధ్య విభేదాలు మొదలవ్వడానికి.. కాంగ్రెస్ అధిష్టానం అనుచరులు ఉండనే ఉన్నారు. వారు రాజధాని మా ప్రాంతంలో ఉండాలి.. అంటే మా ప్రాంతంలో ఉండాలి..అంటూ వాదన మొదలుపెట్టే అవకాశాలున్నాయి. వారితో పాటు ప్రజలు కూడా డైవర్ట్ అవతారు. అప్పుడు సీమాంధ్రలోసమైక్యాంధ్ర ఉద్యమం కాకుండా. .రాజధాని ఉద్యమం మొదలువుతుంది! కాంగ్రెస్ హైకమాండ్ సేఫ్ జోన్ లోకి వెళుతుంది. విభజన గురించి వ్యతిరేకత తగ్గుతుంది.. రాజాధానిని ఏర్పాటు చేయడమో లేక.. సీమాంధ్రను మళ్లీ రెండు ముక్కలు చేయడమో.. చేస్తారు! విభజించు పాలించు సిద్ధాంతం కాంగ్రెస్ ను సేఫ్ జోన్ లోకి నెట్టేలా ఉంది!

Tuesday, October 15, 2013

డేంజర్ న్యూస్ : ఉద్యోగుల స్థానంలో ఉద్యమంలోకి విధ్యార్థులు!

                    సమైక్య ఉద్యమం ఇక కొత్త పుంతలు తొక్కపోతోందా... ఏ కారణంగా ఉపాద్యాయులను సమ్మె విరమించుకునేలా చేసారో అది నిష్పలం కానుందా... అంటే నిజమేనన్న డేంజర్ సంకేతాలు విజయవాడ నుంచి జారీ అయ్యాయి. శుక్రవారం విజయవాడలో సమావేశమైన విద్యాసంస్థల ఐకాస ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సమైక్య ఉద్యమాన్ని విద్యార్థుల చేతుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. విద్యార్థులు రంగంలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కష్టమే, ఇది ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో ఉద్యమాల్లో చూసాం.
                           అందుకే ఇది డేంజర న్యూసే అంటున్నారు. అయితే సమైక్య ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా సమ్మె విరమించి ఉద్యమం నుంచి తప్పుకుంటున్న సూచనలు కనిపిస్తుండడంతో ఈ నిర్ణయం వెలుబడ్డట్టు భావిస్తున్నారు పరిశీలకులు. విద్యార్థుల ఉద్యమానికి ప్రజలు, ప్రజాసంఘాల మద్దతును కూడ గడుతామని కూడా విద్యాసంస్థల జేఏసి స్పష్టం చేసింది.
                           అంటే రాజకీయ నాయకులను, పార్టీలను సమైక్య ఉద్యమంలోకి రానించేందుకు సీమాంధ్రలో ప్రజలు, సమైక్యవాదులు సిద్దంగా లేరన్న సంకేతాలు కూడా ఈ నిర్ణయం జారీచేసినట్లయిందంటున్నారు.  అంటే సమైక్య రాష్ట్రం కోసం జగన్, చంద్రబాబు వంటి వారు ఆమరణ దీక్షలు చేస్తూ ఉద్యమబాట పట్టి సీమాంధ్ర ప్రజల్లో హీరోలు కావాలని కంటున్న కలలు కూడా వేస్టే అన్న సూచనలు కూడా ఈ నిర్ణయం జారీ చేసింది. ఇదెలా ఉన్నా ఉద్యమాల పేరుతో విద్యార్థుల చదువులు పాడు చేయవద్దు, వారి భవిష్యత్తును బుగ్గిపాలు చేయవద్దు, విద్యాసంస్థలకు ఉద్యమం నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఉపాద్యాయులు సమ్మె విరమించాలి అని మేధావులు, నిపుణులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్ని వృధాకాబోతున్నాయన్న వాదన, సంకేతాలు మాత్రం విద్యాసంస్థల జేఏసి నిర్ణయం డిక్లేర్ చేసింది.

వారంతా కొత్త రాజధాని కాంట్రాక్టుల వేటలో ఉన్నారు!

                   కాంట్రాక్టుల ద్వారా ఆర్థికంగా లబ్ది పొందుదామనే ఆలోచనతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారని ఢిల్లీ సమాచారం.

                  ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతలు సమైక్య ఉద్యమాన్ని పక్కనబెట్టి కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రానికి రాజధానిని ఎక్కడ నిర్మించనుంది అనే అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. కొత్త రాజధాని కాంట్రాక్టుల కోసం ఇప్పటి నుంచే పైరవీలు చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. తాము గతంలో చేపట్టిన భారీ ప్రాజెక్టులు వాటికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సంబంధిత పెద్దలకు సమర్పించి కొత్త కాంట్రాక్టులు అడుగుతున్నారట.

                 ముఖ్యంగా వేల కోట్ల రూపాయల విలువ చేసే విమానాశ్రయం, నౌకాశ్రయం, ఓడ రేవులు, జాతీయ రహదారులు, రోడ్డు, సాగునీటి పథకాలు వంటి ఇతరత్రా కాసుల వర్షం కురిపించే భారీ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీలోని పెద్దలను కలుస్తున్నట్లు సమాచారం. అంతేకాదు... కొత్త రాజధానిని ఎక్కడ పెట్టాలనే విషయంలోనూ వీరంతా ఎవరివారు పైరవీలు చేసుకుంటున్నారు. ఇక అధిష్టానం కూడా.. వీరి పట్ల అధిష్టానం అనుకూలంగానే ఉందట. సమైక్యవాదాన్ని పక్కనపెడితే.. మీకు కోరింది ఇస్తామని హామీ ఇస్తోందట!

రాష్ట్రాన్ని సమైక్యం చేసిన పైలిన్ తూఫాన్!-

                        హమ్మయ్యా... ఎంతో భయపెట్టిన పైలిన్ తూఫాన్ రాష్ట్రాన్ని సమైక్యం చేసింది  అంటున్నారు. అది రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని భయపడిపోయిన ఏపికి అది దసరాసంబరాలను మిగిల్చిందన్న భావం అందరిలో వ్వక్తమవుతోంది. కారణం ఇన్నాళ్లు విడిపోయి కొట్టుకుంటున్న వారిని పైలిన్ తూఫాన్ ఏకం చేసింది. ప్రజాప్రతినిధులు, మంత్రులు కనిపిస్తే చాలు తరిమికొడుతున్న సీమాంద్ర జనం చేత వారు నమస్కారాలు పెట్టించుకునేలా చేసింది అంటున్నారు.
                          అత్యవసర పరిస్థితుల్లో అందరు ఐక్యంగా ఉండాలి, కాదు ఉంటాము అన్న దానిని కూడా ఈ తూఫాన్ రుజువు చేసిందంటున్నారు. తెలంగాణ, సీమాంద్ర అని కాకుండా విపత్తునుంచి ప్రజలను ఆదుకునేందుకు మంత్రులంతా అక్కడ రంగంలోకి దిగారు. ఇక రఘువీరా రెడ్డి అయితే బాదిత ప్రాంతాలను రాత్రిపగలు పర్యవేక్షిస్తూ రెవెన్యూ యంత్రాంగాన్ని వారికి అండగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
                          ఇక తెలంగాణకు చెందిన మంత్రులు కూడా తూఫాన్ బాదిత ప్రాంతాలలో వారి శాఖల ద్వారా ప్రజలకు సహాయం అందించడంలో బిజీ అయ్యారు. వారితో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కలిసి ప్రజల చెంతకు వెల్లి వారి కష్టసుఖాలను, ఇబ్బందులను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ, సురక్షిత ప్రాంతాలకు వారిని చేరవేస్తూ బిజీగా మారిపోయారు. జనాలు కూడా అన్ని మరచిపోయి సారు అంటూ దండం పెడుతూ వారి కష్టాలను విన్నించుకుంటున్నారు. ఇలా తూఫాన్ ప్రజలను, ప్రజాప్రతినిధులను ఏకం చేసింది.
అంతే కాదు సమైక్యం అంటూ ఉద్యోగాలు మాని సమ్మెలోకి దిగి ఉద్యమం చేస్తున్న ఉద్యోగులను విధుల్లోకి చేర్చింది తూఫాన్. దీంతో ఉద్యోగుల సేవలు లేక స్థంబించని కార్యకలాపాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు దూరమయ్యాయి. జీతాలు లేక అవస్తలు పడుతున్న కుటుంబాలు కూడా జీతాలు తీసుకుని అసలసిసలైన పండగ వేల వారి ఇంట్లో ఆనందాన్ని నింపుకున్నారు. ఇక తూఫాన్ ఎంతో భీభత్సం సృష్టిస్తోందనుకుంటే అందరిని కలిపి అది కాస్తా బలహీన పడి ఊహించినంత కష్టం, నష్టం కలిగించకుండా వెల్లిపోయింది. ఇదండీ కొట్టుకుంటున్న తెలుగువారందరని కలిపేసిన పైలిన్ తూఫాన్ సంగతి.

ఆశోక్ బాబు అడ్డుతగులుతున్నాడు!

                      ఎవరెంత నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నా ఉద్యమం ఆగదు, రాష్ట్ర విభజనను అడ్డుకునే తీరుతాం అంటూ ఏపిఎన్జీఓల అద్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేస్తున్నారు. దీంతో హాతాషులవడం మంత్రుల వంటి పెద్దోళ్ల వంతు కాగా, ఏంటి అంత ధీమా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో డేంజర్ విషయం ఏంటంటే ఇప్పడు కొందరు సమ్మె విరమించడం కూడా ఉద్యమంలో భాగమే అని చెప్పి అందరిని గుండెలను గుబెల్లుమనిపించాడు.
ఇక ఆయన ధీమా ఏంటో చూద్దాం, నోట్ వచ్చినంత మాత్రానా అన్ని అయిపోయినట్టు కాదట, అడ్డుకునేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఉన్నాయట. ఆయన రాజకీయ నాయకులనే దగ్గరికి రానీయకుండా ఉద్యమం చేస్తున్నప్పుడు ఉద్యోగి అయి ఉండి అసెంబ్లీలో, పార్లమెంటులో తెలంగాణ ఆమోదం పొందకుండా ఎలా అడ్డుకుంటాడు అన్న సందేహాలు అందరికి కలగవచ్చు. కాని అది తప్పు, అసెంబ్లీలో అడ్డుకుంటామని ఎమ్మెల్యేలతో హామీ పత్రాలు తీసుకుంటున్నాడు అశోక్ బాబు.
ఇక పార్లమెంటులో ఎలా అడ్డుకుంటాడన్నదే కదా మరో సందేహం, పార్లమెంటులో బిల్లు పెట్టేనాటికి అక్కడు సీమాంద్ర ఎంపీలనే లేకుండా చేస్తాడు, అందరి రాజీనామాలు అయిపోతాయి. అనుకున్నట్లు జరిగితే అసలు పార్లమెంటే ఉండక పోవచ్చు అన్నది ఆయన ధీమా. ఇందులో కూడా నిజముందనుకోండి, అందుకు తగ్గట్టుగానే పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి.

  అయినా ఓ మంచి లక్ష్యం కోసం తెగించి రంగంలోని దిగిన ఉద్యమకారులకు ఉండాల్సింది నమ్మకమే, అది సన్నగిల్లితే టార్గెట్ చేరుకోలేరు, అందుకే సమైక్యవాదులంతా ఆయన తెగువకు సలాం చేస్తున్నారు.

ఫ్లాష్ న్యూస్ : త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఔట్ – తెలంగాణ డౌట్

             ఫ్లాష్ న్యూస్.... త్వరలోనే కేంద్రప్రభుత్వం మైనార్టీలో పడనుంది, ప్రభుత్వం గద్దె దిగనుంది. ఈ మాటలు ఏకంగా కేంద్రమంత్రి, యూపిఏ లో కీలక భాగస్వామి అయిన శరద్ పవార్ తెలిపారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కేంద్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని, ఎన్నికలు తెలంగాణ ఏర్పాటుకు ముందుగానే వస్తాయని చెప్పారు. దీంతో ఇది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
            తన రాజీనామా ఆమోదం కోసం లగడపాటి రాజగోపాల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించనుందని శరద్ పవార్ మాట. దీంతో రాజీనామాలు చేసిన మిగతా ఎంపీలవి కూడా  ఆమోదించాల్సి వస్తుంది, అంతే కాదు అవి ఆమోదించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారట. ఇదే జరిగితే కేంద్రంలో యూపిఏ సర్కారు మైనార్టీలో పడిపోతుంది. పలితంగా ముందస్తు ఎన్నికలకు వెల్లాల్సిందే అంటున్నాడు శరద్ పవార్.
            పైగా అత్యంత సంక్లిష్టంగా మారిన తెలంగాణ సమస్యను తప్పించుకోవాలన్నా, దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నా ఇదే సరైందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. అందుకే తెలంగాణ ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు వేస్తోంది, ఈ దశలో దానికి నిరసనగా సీమాంద్రకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు రాజీనామాలు చేస్తారు, ఇప్పటికే దాదాపు మొత్తం మంది చేసారు, మిగిలిన వారు చేస్తారు, లగడపాటి రాజీనామా సాకు చూపి అందరివి తప్పనిసరిగా ఆమోదించాల్సి వస్తుంది.
            దీంతో సర్కారు మైనార్టీలో పడిపోయి ఇక ఎన్నికలకు వెల్లాల్సి వచ్చిందని, ఎన్నికలయ్యాక తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికలను ఎదుర్కుంటుంది. దీంతో ఏపిలో తమ విభజన నిర్ణయం  ఎంత వరకు పనిచేసింది, జగన్, చంద్రబాబు, కేసిఆర్ ల అసలు సంగతేంటి, వారి బలం ఎంతో కూడా తెలుస్తుంది, దానిని బట్టి తెలంగాణపై ముందుకు పోవచ్చు, అదృష్టం బాగాలేక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక చిక్కే ఉండదనుకోండి. అయితే ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట, పరిణామాలు ఎలా ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది ఎదిరిచూడాలి.

పళ్లికిలించిన పల్లంరాజు!

         కేంద్ర మంత్రి పల్లంరాజు పళ్లికిలించారు, దీంతో ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న సామెతనే నేడు ఎందుకు పుట్టాను అని సిగ్గుపడే పరిస్థితిని కల్పించాడు. విభజనను ఆపుతాం, అందుకే మేము పదవుల్లో కొనసాగుతున్నాం అంటూ వారిని ఎన్నుకున్న ప్రజలు తిట్లు, శాపనార్థాలు, చివరకు హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా మాకు పరువు కన్నా పదవే ముఖ్యం అన్నారు కొన్నాళ్లు. చివరకు వారు చెప్పిన సాకు...
 ‘రాష్ట్ర విభజనను ఆపుతాం’ అన్నది అయ్యేలా లేకపోవడంతో ఇక ప్రజలు పారిపోయినా సరే పట్టుకుని తంతారు అనుకున్నారేమో తప్పని సరి పరిస్థితిలో రాజీనామాలు చేసారు.

               అయినా పదవిపై చేవ చావక పదవిలో ఉంటూనే ఇప్పుడు మళ్లీ పళ్లికిలించడం చూస్తుంటే వారిని ఎన్నుకున్న ప్రజల గుండెలు మండుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా ఆయన మళ్లీ కేంద్రమంత్రి హోదాలోనే ఢిల్లీలో తిరుగుతున్నారు. తాజాగా ఆయనకు సమైక్య సెగ తాకింది, అసలే సమైక్యం కోసం రాజీనామా చేసానన్న ధీమాలో ఉన్నాడాయే, ఊరుకుంటాడా, వెంటనే చక్కటి సమాధానం చెప్పి తాను సమైక్యమే, తెలాంగాణాను అడ్డుకోవడానికే రాజీనామా చేసాం అంటాడనుకున్నారు, అయితే ఆయన సమాధానం విని ముక్కున వేలేసుకోవడం అందరి వంతయింది.
           ఆ సమాధానమేంటంటే అవును నేను రాజీనామా చేసాను కదా, ప్రధానికి రాజీనామా లేఖ ఇచ్చాను, అది ఆమోదించాలా.. వద్దా అన్నది ప్రధాని చేతిలో ఉంది అన్నాడు. అప్పడు అర్థమయింది ఆయన రాజీనామా వెనుక దాగి ఉన్న అసలు బాగోతం. సరే ఇంతకీ రాష్ట్రం పరిస్తితి ఏంటి అంటే ఏముంది.... తెలంగాణ ఏర్పాటు ఆగేలా లేదు, విభజన ప్రక్రియపై కాంగ్రెస్ వెనుకడుగు వేసే పరిస్థితులు లేవు అని చెప్పి అందరిని హతాషులను చేసాడు పల్లంరాజు. ఏదైతే ఆపుతాం, అది మారాజీనామాలతో సాద్యం అన్నారో, వారిలో ఒకరే ఇలా అసలు విషయం చెప్పాక ఇక సమైక్యంపై ఆశతో అన్ని త్యాగం చేసి పోరాడుతున్న వారి పరిస్థితి మాటేమిటి!

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే "తెలంగాణ''!

    
        వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపిస్తేనే తెలంగాణ ప్రక్రియ పూర్తి అవుతుందా? లేకపోతే తెలంగాణ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందా? రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎన్నికలు ప్రధాన అడ్డంకి కాబోతున్నాయా? ప్రస్తుత పరిస్థితుల్లో కలుగుతున్న అనుమానాలివి. కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోంది.. అన్న వార్తల నేపథ్యంలో ఈ అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో కాంగ్రెస్ గేమ్ ప్లాన్ కూడా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 
         రాష్ట్ర విభజనతో సీమాంధ్రలోకాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది.. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ విషయంపై అవగాహన ఉంది. మరి తెలంగాణ ఏర్పాటు వల్ల ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ సీట్లను దక్కించుకొనే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొనే అవకాశాలున్నాయి. అందులో ముఖ్యమైనది ఎన్నికల ముందే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించకపోవడం, ఈ ప్రక్రియను పెండింగ్ లోనే పెట్టి ఎన్నికలకు వెళ్లడం.
తద్వారా తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ పరువు దక్కించుకోవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఆశిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నేతలు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారు. దీని వల్ల ఇక్కడ అన్నో ఇన్నోసీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఇక సీమాంధ్ర నేతలకు జనాల్లోకి వెళ్లే ధైర్యం లేదు. మరి వారికి దాన్ని అందించాలంటే.. తెలంగాణ ప్రక్రియ నెమ్మదించాలి. ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజనను పూర్తి చేస్తే.. అందుకు పర్యవసనాలను ఎన్నికల్లోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే తెలంగాణ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. సీమాంధ్ర నాయకులకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇక తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ ప్రకటించామని.. వచ్చే ఎన్నికల్లో మాకే అధికారం ఇస్తే తెలంగాణ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇస్తుంది. ఇది కాంగ్రెస్ గేమ్ ప్లాన్.

అయ్యబాబోయ్... సమైక్య షాక్

అయ్యబాబోయ్... సమైక్య షాక్ అంటున్నారు, దాని విలువెంతో తెలిసాకా అందరు పని నోళ్లు వెల్లబెట్టడం తప్ప ఇప్పుడేం చేయలేని పరిస్థితి. కాంగ్రెస్ కేవలం తన రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న పనికి రెండు నెలల్లోనే జరిగిన నష్టం విలవ లక్ష, రెండు లక్షలో కాదు ఏకంగా 4 వేల కోట్లు. ఇది కూడా కేవలం ఉద్యోగులు చేసిన సమ్మె వల్లనే జరిగింది. అంటే ప్రైవేటు రంగంలో ఎంత లేదన్నా మరో 4 వేల కోట్లయితే ఉంటుందని అంచనా.
అంటే ఇప్పటి వరకు జరిగిన నష్టం దాదాపు ఎనిమిది వేల కోట్లన్నమాట. ఇది ఆగిందా.. అంటే అదీ లేదు, ఆర్టీసి, విద్యుత్ శాఖల వల్లే జరిగే నష్టం నివారించబడినా రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సయిజ్, వాణిజ్య పన్నులతో పాటు మరెన్నో శాఖలకు సంబందించిన నష్టం జరుగుతూనే ఉంది. అంటే ఇది ఏ స్తాయికి చేరుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అసలే ఆర్థికంగా కుదేలయిన ఆంద్రప్రదేశ్ ఇంత నష్టాన్ని పూడ్చుకుంటుందా, లేక ఇది ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలపై పడి చివరకు ప్రజలే బలవుతారా... అంటే నిపుణులు మాత్రం ప్రజలే అంటున్నారు.
ఇప్పటి వరకు వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం 500 కోట్లు, రవాణా, మోటారు, వాహనాల పన్ను వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయం 210 కోట్లు, ఎక్సయిజ్ ద్వారా వచ్చేది 380 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 350 కోట్ల నష్టం  జరిగింది. అలాగే గనులు, భూగర్భవనరులు ద్వారా వచ్చే ఆదాయం 150 కోట్లు, పన్నేతర ఆదాయం 193 కోట్ల నష్టం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా ఈ అనిస్చితికి తెరదించకుండా కేంద్రం చోద్యం చూస్తుండడం, హైకమాండ్ పెద్దలు రోజుకో తీరు మాట మారుస్తూ ఇంకా ఈ ఉద్యమాన్ని రెచ్చగొడుతుండడం దారుణం.

సమైక్యవాదినే కానీ సంతకం పెట్టను!

బొత్స సత్తిబాబు మామూలు సూపర్ కాదు. సూపర్ కే సూపర్. ఆయన తిమ్మిని బమ్మిని.. బమ్మిని.. తిమ్మిని చేయటంలో ఆయనకు మించినోళ్లు హోల్ ఆంధ్రప్రదేశ్ లోనే దొరకరు. సీమాంధ్రలో అంత పెద్ద ఉద్యమం జరుగుతున్నాఅదరని.. బెదరని ఏకైక ఆయన ఖ్యాతి విశ్వవ్యాప్తి అయ్యింది. ఆయన గొప్పతనాన్ని గుర్తించిన సొంత జిల్లా వాసులు కడుపు మండి మాటల నుంచి చేతల వరకు వెళ్లారు.
అలాంటి సమయంలో ఏ రాజకీయ నాయకుడైనా ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. అలా చేస్తే ఆయన బొత్స సత్తిబాబు ఎందుకవుతారు. ఎందుకు అనవసరంగా ఆస్తులు ధ్వంసం చేస్తారు. చేస్తే..చేశారు కానీ వాళ్ల మీద కేసులు పెట్టొద్దు.. కనీసం లాఠీ కూడా ఎత్తొద్దని టీవీల్లో అదే పనిగా చెప్పారు. అదేం చిత్రమో.. ఆయన ఆ మాట అన్న తర్వాత నుంచి దొరికినోళ్లను దొరికినట్లుగా పోలీసులు కుమ్మేశారు. కొంతమంది అమాయులు కూడా పోలీసుల దాష్ఠీకానికి బలైపోయారు.అలాంటి మనిషిలో మరో కోణం ఉంది. పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లి వెంకన్నను దర్శించుకొని బయటకు వచ్చిన ఆయన.. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. సామాన్యుడు కోరితే ఆ స్వామి వింటారో లేదో కానీ.. సత్తిబాబు అడిగిన కొద్దీ రోజులకే తెలంగాణ రాష్ట్ర ప్రకటనే సోనియమ్మ చేయించేసింది. ఇంతకీ ఆయన తిరుమల వెంకన్నను ఏం అడిగారన్నది ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మారింది.
పుట్టిన రోజు సైతం తాను మరో వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలనో.. ఇంకా పెద్దపెద్ద పదవుల్లోకి వెళ్లాలనో కోరుకోకుండా పిచ్చ జనం కోరుకుంటున్నట్లు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోవటం ఉంది చూశారు.. సమీప భవిష్యత్తులో ఇంతటి విశాల మనసు ఉన్న నేత తెలుగువాళ్లకు దొరకటం కష్టమే. అంతటి కరుడుగట్టిన సమైక్యవాదిని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు వెళ్లి.. ‘‘సార్, మేం రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకున్నాం. పీసీసీ అధ్యక్షుని హోదాలో విభజనకు వ్యతిరేకమని ఒక్క సంతకం పెట్టండి’’ అంటే.. ఒక్క నవ్వు తాను సమైక్యవాదినేనని.. గతంలో పార్టీకి ఇచ్చిన లేఖలో సంతకం పెట్టాను కాబట్టి మరోసారి సంతకం పెట్టటం కుదరదని తేల్చి చెప్పారు. సత్తిబాబు ఎంత హుషారో చూశారా.