Menu bar





Tuesday, November 12, 2013

పార్లమెంటు సుప్రీం అంటారు. దానికి తిరుగే లేదంటారు. ఇది నిజమా?


పార్లమెంటు సుప్రీం అంటారు. దానికి తిరుగే లేదంటారు. ఇది నిజమా?

పార్లమెంటు భారత రాజ్యాంగం ఆధారంగా ఏర్పడింది. రాజ్యాంగానికి అది పూర్తిగా నిబద్ధతతో ఉండాలి. అదే ప్రమాణం చేసే ఎవరైనా పార్లమెంటులో అడుగుపెట్టాలి.

పార్లమెంటు రాజ్యాంగానికి అనుగుణంగా నడచుకుంటోందా లేదా అన్నది తేల్చవలసింది సుప్రీం కోర్టు! అంతిమంగా , పార్లమెంటు, రాజ్యాంగం, సుప్రీం కోర్టు - వీటన్నిటినీ నడిపించేది ప్రజా ధర్మం.

పార్లమెంటులో 500 మంది సభ్యులూ ఏకమై పోయినా - భారత రాజ్యాంగాన్నిరూపుమాపలేరు. అప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుంది.
ఒకోసారి ... ప్రజాభిప్రాయం - ఆ మూడు వ్యవస్థలను కూడా ప్రభావితం చెయ్యవచ్చు. అంతిమంగా ప్రజల తీర్పే అన్నుల మిన్నగా నిలుస్తుంది. అట్లాంటి అపురూపమైన సన్నివేశాలు జాతి జేవనంలో అప్పుడప్పుడూ వస్తాయి. సమైక్య ఉద్యమం అట్లాంటిదే!

తెలుగు జాతిని చీల్చే అధికారం కేంద్రానికి గానీ, పార్టీలకు గానీ, చివరకు పార్లమెంటుకు కూడా లేదని జనం చెబుతున్నారు. మాకు ప్యాకేజీలు వద్దు; రాష్ట్ర సమైక్యమే ముద్దు అని నినదిస్తున్నారు.

అసెంబ్లీలో సాధారణ జనాభిప్రాయం ఏమిటో తీర్మానమైనప్పుడు, రాష్ట్రపతి - దానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకోవాలి. సమైక్యమే కావాలని శాసన సభ తీర్మానిస్తే, అది జాతి సమగ్రతకు భంగం కాకపొతే, అట్లాంటి ప్రజాభిప్రాయాన్ని రాష్ట్రపతి మన్నించాల్సిందే! ఆర్టికల్ 3 లో రాసి ఉందిగదా అని , ప్రజల అభ్యంతరాలకు వ్యతిరేకంగా - రాష్ట్ర విభాజన చేయ్యలేరు!

పార్లమెంటు సభ్యులు కూడా గుడ్డిగా పార్టీ విప్ పాటించకూడదు! ఇట్లాంటి విషయాలలో పార్టీలకు వ్హిప్ అధికారమే ఉండకూడదు! బీజేపీ పార్లమెంటు సభ్యులకు రాష్ట్ర విచ్చిన్నాన్ని సమర్థించే నైతిక హక్కే లేదు. ఆ పార్టీలో పార్లమెంటులో మాట్లాడేందుకు ఈ రాష్ట్రానికి ప్రతినిధే లేడు! అట్లాంటి పార్టీ తగుదునమ్మా అని రాష్ట్ర విభజన నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది?

విభజన బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోవచ్చు; వచ్చినా అది వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డ్రాఫ్టు బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడే - జనం దాన్ని తిప్పి కొట్టడం ఖాయం. ప్రజలు ప్యాకేజీలు కోరడం లేదు; రాష్ట్ర సమైక్యతనే కోరుతున్నారు. ఈ వాస్తవం గ్రహించి నేతలు మసలుకోవాలి!

No comments:

Post a Comment