Menu bar





Thursday, September 26, 2013

ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం, అసెంబ్లీ తీర్మానం పేరుకు మాత్రమే; 
ఆ తర్వాత పార్లమెంట్ లో 'బీజేపీ తోడ్పాటుతో' బిల్లు పాస్ అవుతుంది. కనుక పెద్ద ఇబ్బందేమీ ఉండకపోవచ్చు, అనేదే కాంగ్రెస్ నమ్మకం. అయితే, అదంతా గతంలో ఏర్పడిన సందర్భాలను బట్టే మాట్లాడుతున్నారు.

కానీ రాజ్యాంగ కోవిదులేమంటున్నారు: రాజ్యాంగ నియమాల వర్తింపు ప్రతి సందర్భానికీ, దాని నేపథ్యం బట్టి, ముందున్న ప్రతిపాదనలను అనుసరించి వర్తిస్తాయి. అన్నిటికీ ఒకే మంత్రం అన్నట్లు ఉండదు!

రాజ్యాంగంలోని వివిధ క్లాజుల మధ్య వైరుధ్యం ఉంటే, ఏ క్లాజులకు ప్రాధాన్యం అనే ప్రశ్న ఉదయిస్తుంది. అదంతా న్యాయకోవిదుల వ్యవహారం. మనవరకు వస్తే - సమస్యకు ఒక రాజ్యాంగ పరిష్కారం ఇంకా మిగిలే ఉంది; రాజకీయ పార్టీల 'జూదరి నిర్ణయాలే' అంతిమం కాదు, అని అర్థం చేసుకుంటే చాలు!

రాష్ట్ర విభజన విషయంలో 'రాజ్యాంగ సమస్య' వస్తుంది అంటున్నారు రాజ్యాంగ నిపుణులు డా. కేవీ నారాయణ రావు.














No comments:

Post a Comment